బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి.ఈ షో కి ఇప్పటికే చాలామంది టాలెంట్ ఉన్న కమెడియన్లు రావడం జరిగింది. ఇక ఈ షో తో కమెడియన్లుగా తమ కంటూ మంచి గుర్తింపును తెచ్చుకొని ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చారు .వెండితెరపై ఎన్నో అవకాశాలతో దూసుకుపోతున్నారు జబర్దస్త్ కమెడియన్స్. ఇక జబర్దస్త్లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకెట్ రాఘవ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2001లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ను అందుకోలేకపోయారు. 

దాని అనంతరం జబర్దస్త్ లోకి కమెడియన్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈయన.. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా రాకెట్ రాఘవ మాట్లాడుతూ... నేను హైదరాబాద్ కి వచ్చిన మొదట్లో జెమినీ టీవీలో ఒక షోలో పాల్గొన్నాను.. ఇక ఆ షోలో భాగంగా ఆ షో కి  డైరెక్షన్ చేసే డైరెక్టర్ పక్క రూమ్లోనే నా రూమ్ కూడా ఉంది. ఇక ఆ సమయంలో ఆ షో కి యాంకర్ గా శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు. అయితే డైరెక్టర్ పక్క రూమే నా రూమ్ కూడా కావడంతో ఈ షో డైరెక్టర్ నన్ను కమెడియన్ గా చేస్తావా అంటూ అడిగాడు. దాంతో అవకాశం వచ్చింది కదా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని చాలా సంతోషించాను.

ఇక కమెడియన్ గా ఆ షో కి  వెళ్ళాను. ఓ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత యాంకర్ శ్రీనివాస్ నన్ను చూసి చూడనట్టు వెళ్లిపోయారు. దాని అనంతరం ఒకరోజు శ్రీనివాస్ రెడ్డి నన్ను కలిసి నిన్ను ఈ షో వాళ్ళు చేయమని అడిగారా అంటూ నన్ను అడిగారు. దీంతో అవునండి నన్ను చేయమని చెప్పారు అని నేను చెప్పాను. అసలు నువ్వు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు అంటూ చెప్పుకొచ్చాడు శ్రీనివాస్ రెడ్డి. ఇక ఈ విషయం ముందుగా ఆయనకి చెప్పకుండా నేను దాచాను ఆయన్ని దారుణంగా మోసం చేశాను. ఇప్పటికీ కూడా శ్రీనివాస్ రెడ్డిని నేను మోసం చేశాను అన్న ఫీలింగ్ నాలో ఉండిపోయింది. ఇప్పటికీ కూడా ఆయన్ని చూస్తే ఆయనని నేను మోసం చేశాను అన్న భావని మొదట నాలో కలుగుతుంది. అంటూ చెప్పుకోచాడు రాకెట్ రాఘవ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: