సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ 27వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ త్వరలో రానున్నాయి. అయితే ఈ సినిమానే కాదు మహేష్ వరుసగా తన తర్వాత చేసే డైరక్టర్స్ తో చర్చలు నడిపిస్తున్నాడట.

 

వంశీ పైడిపల్లి తర్వాత త్రివిక్రం తో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో త్రివిక్రం, మహేష్ సినిమా ఉంటుందట. అయితే ఈ సినిమా ఎప్పుడన్నది మాత్రం ఇంకా తెలియలేదు. కె.జి.ఎఫ్ తో సత్తా చాటిన ప్రశాంత్ నీల్ కూడా మహేష్ తో సినిమా చేసేందుకు రెడీ అంటున్నాడు. కె.జి.ఎఫ్ తో సత్తా చాటిన ఈ యువ దర్శకుడు తెలుగులో సూపర్ స్టార్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ మహేష్ కు స్టోరీన్ లైన్ వినిపించాడట.

 

కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కూడా హిట్ అయితే మహేష్ కచ్చితంగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. వీరే కాదు మహేష్ తో మరోసారి సరిలేరు నీకెవ్వరు డైరక్టర్ పనిచేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. సెట్స్ మీద ఉన్నప్పుడే సరిలేరు రిజల్ట్ ఊహించిన మహేష్ అనీల్ తో మరో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడట. అనీల్ కూడా మహేష్ కోసం ఓ కొత్త కథ చెప్పాడట. లైన్ కూడా మహేష్ కు నచ్చడంతో మళ్లీ ఈ కాంబోలో సినిమా వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి మహేష్ మాత్రం హ్యాట్రిక్ హిట్లు కొట్టడమే కాదు అదే రేంజ్ లో తన తర్వాత సినిమాల దర్శకులను లైన్ లో పెట్టాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: