అక్కినేని సమంత మజిలీ, ఓ బేబి వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మళ్ళి 'జాను' తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది సమంత. జాను సినిమాని కోలీవుడ్ లో అనూహ్యంగా సూపర్ హిట్ అయిన '96' సినిమాకి అఫీషియల్ రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమా రీమేక్ లో చేయకూడదని సమంత మొదట్లో అనుకున్నదట. అందువల్లే చాలా రోజులు దిల్ రాజు అడుగుతూ వెంట పడుతున్నా కలవకుండా మేనేజర్ తో ఏవేవో కారణాలు చెప్పించి తప్పించుకుదట. ఇక తన భర్త చైతూ కి కూడా ఆ క్లాసిక్ సినిమాను రీమేక్ చేయడం ఇష్టం లేదని ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది.

 

అయితే దిల్ రాజు కలిసి కలవగానే ఎందుకనో మొహమాటం కొద్ది సినిమా చేస్తున్నట్లు ఒప్పుకున్నానని.. ఒకవేళ అప్పుడు ఒప్పుకోకపోతే నా కెరీర్ లో ఓ మంచి మిస్సయిండుండేదని తెలిపింది. ఇక విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ కి శర్వా బెస్ట్ అంటూ కితాబిచ్చింది సమంత. ఇదే సందర్భంలో రంగస్థలం చేయకముందు పూర్తి కథ కూడా తెలియదని జస్ట్ నా క్యారెక్టర్  అలాగే కొంత స్టోరీ మాత్రమే తెలుసనీ అది లక్కీ ప్రాజెక్ట్ అని కథను నమ్మి చేసిన సినిమా కాదని షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. 

 

ఇక చైతూకి కథల సెలెక్షన్ లో ఎలాంటి సలహాలు ఇవ్వనంటూ తెలిపింది. అంతేకాదు ఇద్దరు సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటామని చెప్పుకుంది. ఇక రిటర్మెంట్ అనేది నా చేతిలో లేదని ప్రేక్షకులు నన్ను ఆదరించినన్ని రోజులు సినిమాలు చేస్తూనే ఉంటానని వెల్లడించింది. ఇక ఎలాంటి హైప్ లేకుండా వస్తున్న జాను సమంత కెరీర్ లో నిజంగానే బెస్ట్ ఫిలిం అవుతుందా చూడాలి. అంతేకాదు ఈ సినిమా గనక హిట్ అయితే హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మజిలీ, ఓ బేబీ రెండు సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ రెండు హిట్స్ తర్వాత వస్తుంది కాబట్టి హ్యాట్రిక్ హిట్ అవుతుంది జాను. 
    

మరింత సమాచారం తెలుసుకోండి: