ఈ మధ్య పూజ హెగ్డే పేరు టాలీవుడ్ లో ఎక్కువ గా వినపడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఈ భామ కాస్త హిట్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ముందు ఫ్లాప్ తో కెరీర్ స్టార్ట్ చేసినా అభిమానులకు కావాల్సింది ఆమె వద్ద ఉండటంతో దర్శక నిర్మాతలు పాపను కాస్త షైన్ చేసి సినిమాలు చేయిస్తున్నారు. దీనితో వరుస అవకాశాలను దక్కించుకుంటూ హడావుడి చేస్తుంది. మీకు కావాల్సింది నా దగ్గర ఉందీ అంటూ స్టార్ హీరోలను కూడా ఆకట్టుకుంటుంది. 

 

చాలా మంది స్టార్ హీరో ల పక్కన పూజ అయితేనే సరిపోతుంది. హైట్ తో పాటుగా గ్లామర్ కూడా పాపకు ఎక్కువే కావడంతో హీరోలు కూడా పూజనే రిఫర్ చేస్తున్నారు. దీనితో ఈ అమ్మాయి కాస్త రేంజ్ పెంచింది. మహర్షి సినిమా వరకు 70 లక్షలు చెప్పిన ఈ భామ ఇప్పుడు కోటి అంటున్నట్టు సమాచారం. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో ఈమె రేంజ్ కాస్త పెరిగింది. దీనితో దర్శకులు ఇప్పుడు పూజ జపం చేస్తున్నారు. అందుకే ఈ అమ్మాయి తన రేంజ్ పెంచే కార్యక్రమంలో ఉంది. 

 

ఇక లక్షలు కాదు గాని కోట్లు అంటుంది ఈ అమ్మాయి. సోషల్ మీడియాలో కూడా నాకు క్రేజ్ ఉంది కాబట్టి ఓకే కోటి రూపాయలు చెప్పేస్తుంది. అదే త్రివిక్రమ్ కి మండినట్టు సమాచారం. ఇటీవల పాపను తర్వాతి ఎన్టీఆర్ సినిమాకు అడిగారట త్రివిక్రమ్. తనతో రెండు సినిమాలు చేయడం, ఆ రెండు కూడా బంపర్ హిట్స్ అవ్వడంతో పూజ కోసం త్రివిక్రమ్ కాస్త ఆసక్తి చూపించి అడగగా... భారీగా పారితోషకం చెప్పి అంత అయితేనే చేస్తా అని చెప్పినట్టు తెలిసింది. సర్లే థాంక్స్ అంటూ రష్మికను అడుగుతున్నారట. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: