వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ హిట్టు కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సినిమాలు మాత్రం ఒప్పుకుంటూనే ఉన్నాడు. పస్తుతం అతడు నటించిన సీటీమార్ చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. అన్నీ సవ్యంగా కుదిరితే ఈ పాటికే సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా మూలంగా వాయిదా పడింది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై గోపీచంద్ బాగా నమ్మకం పెట్టుకున్నాడు.

 

అయితే ఆ సినిమా అనంతరం గోపీచంద్, తేజ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమా ద్వారా మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన తేజ, ఈ సారి కాస్త డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఆ సినిమాకి అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ పెట్టాడు. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా కనిపించబోతున్నాడట. అయితే ఈ సినిమాలో అలివేలుమంగ గా ఎవరు నటిస్తారనేది ఆసక్తిగా మారింది.

 

ముందుగా ఈ సినిమాలో నటించడానికి కాజల్ ని అనుకున్నారట. అయితే కాజల్ చాలా బిజీగా ఉంది. ఆచార్య, మోసగాళ్లు, ఇండియన్ 2 , ముంబయి సాగా వంటి చిత్రాలతో చాలా బిజీగా గడుపుతోంది. అందువల్ల అనుష్క పేరును అనుకున్నారు. కానీ అనుష్క ఈ సినిమాని ఒప్పుకుంటుందో లేదో తెలియదు. ఆ తర్వాత రకుల్ ప్రీత్ అయితే బాగుంటుందని ఫీల్ అయ్యారు. కానీ చివరగా కీర్తి సురేష్ ని ఫైనల్ చేసే ఆలోచన్లో ఉన్నారని తెలుస్తుంది.

IHG

ఈ మేరకు కీర్తితో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఒకవేళ కీర్తిసినిమా ఒప్పుకుంటే తోందర్లోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని అంటున్నారు. మరి కీర్తి సురేష్ అలివేలుమంగ గా నటించడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ కీర్తిసినిమా ఒప్పుకుంటే మరింత మైలేజ్ వచ్చినట్టే. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ మళ్ళీ సక్సెస్ బాట పడతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: