సైరా సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ఇప్పుడు ఆచార్య సినిమా  చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ సినిమా  తరువాత చిరంజీవి మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవి రెండు కూడా రీమేక్సే కావడం విశేషం. ఆ రీమేక్స్ లో ఒకటి మెహర్ రమేష్ చేస్తుండగా మరొకటి v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ చేస్తున్నాడు. మెహర్ రమేష్ చేస్తున్న సినిమా వేదాళమ్ రీమేక్ లో చిరంజీవి కి చెల్లిగా సాయి పల్లవి నటిస్తుంది ముందు నుండి వార్తలు గట్టిగానే ప్రచారంలోకి వచ్చాయి.

 మెహర్ రమేష్‌ సాయిపల్లవికి కథ కూడా చెప్పాడని ఆమె ఓకే కూడా చెప్పిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని స్వయంగా సాయి పల్లవి తేల్చేసింది. ఆ పాత్ర కోసం మెహర్ రమేష్ కీర్తి సురేష్ ని అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఒప్పుకున్నట్టు ఎక్కడా చెప్పలేదు. కేవలం ఇది గాసిప్ అనుకోవచ్చు. కానీ ఆమె ఒప్పుకోవడం జరిగే పని కాదు. ఎందుకంటే ఈ సినిమా తమిళ మాతృకలో నటించిన హీరో యిన్ లక్ష్మీ మీనన్ కి ఈ సినిమా తరువాత ఒక్క హీరోయిన్ ఛాన్స్ కూడా రాలేదు మరి.

 మంచి రోల్, స్టార్ హీరోకి చెల్లెలుగా నటించవచ్చు కానీ ఇలా హీరోయిన్ అవకాశాలకే ఎసరు అంటే ఎవరయినా ఆలోచిస్తారు కదా మరి. మరి ఈ విషయంలో కీర్తి సురేష్ ఏమి చేస్తుందా ? అనే విషయం ఆసక్తికరంగా అయితే మారింది. ఆమె ఒప్పుకుంటే కనుక అది ఒక డేరింగ్ అండ్ డ్యాషింగ్ స్టెప్ అని చెప్పచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: