హీరో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ ఆలస్యం కారణంగా త్రివిక్రమ్ మూవీ కూడా బాగా లేట్ అవుతోంది. తాజా సమాచారం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తర్వాత కూడా మరో మూడు నెలలపాటు హీరోలిద్దరూ తనతోనే ఉండాలని, కొత్త సినిమాలకోసం గెటప్ లు మార్చేస్తే కుదరదని దర్శకుడు రాజమౌళి తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో హీరో ఎన్టీఆర్ కోసం వేచి చూస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ వేరే హీరోతో మధ్యలో ఓ సినమా చేసి వస్తాడని పుకార్లు మొదలయ్యాయి.

హీరో మహేష్ బాబు, రామ్ త్రివిక్రమ్ కోసం వేచి చూస్తున్నారని, ఎన్టీఆర్ తో సినిమా ఆలస్యం అయితే మధ్యతో తమకు ఓ సినిమా చేసి పెట్టాలని అడిగారని వార్తలొచ్చాయి. వాస్తవానికి త్రివిక్రమ్ దగ్గర ఎన్టీఆర్ కి మినహా మిగతా ఎవరికీ కథలు రెడీగా లేవు. ఒకవేళ కథ రెడీ చేసుకుని సెట్స్ పైకి వెళ్లాలనుకుంటే పెద్ద తతంగనే నడవాలి. ఆలోగా ఎన్టీఆర్ ఖాళీ అయి వచ్చేస్తే అప్పుడు త్రివిక్రమ్ ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారని సమాచారం.

త్రివిక్రమ్ వేరే హీరోతో సినిమాకి ఫిక్స్ అయితే.. ఎన్టీఆర్ కూడా వెనక్కు తగ్గరని, కొరటాల శివ లేదా మరో డైరక్టర్ తో అర్జెంట్ గా ఆయన సినిమా ప్రకటిస్తారని కూడా అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని నిర్మాణ సంస్థ హారిక హాసిని వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. త్రివిక్రమ్ కచ్చితంగా ఎన్టీఆర్ తోనే సిినిమా చేస్తారని, ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ మూవీనే చేస్తారని అంటున్నారు నిర్మాతలు.
త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షెడ్యూలు వివరాలు అన్నీ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మేరకు మార్చి నాటికి తాను ఫ్రీ అయిపోతాను అని ఇండైరెక్ట్ గా ఎన్టీఆర్ చెబుతున్నారు. ఏదేమైనా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీకి మహేష్ బాబు, రామ్ అడ్డంకిగా ఉన్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవాలని అంటున్నారు. సినిమా రావడం లేటవుతుందేమో కానీ, రావడం మాత్రం పక్కా అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: