ప్రభాస్ బాహుబలి సినిమా తో దేశమంతటా ఎంత పాపులర్ అయ్యాడో అందరికి తెలిసిందే.. ఈ సినిమా తో టాలీవుడ్ మార్కెట్ ని వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత ప్రభాస్ ది అని చెప్పాలి.. ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందనడంతో భారీ బడ్జెట్ పెట్టి ప్రభాస్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.. సాహో బడ్జెట్ కూడా  వంద కోట్లు దాటింది.. ఆ సినిమా ఫెయిల్యూర్ అయినా కలెక్షన్ లు ఏమాత్రం తగ్గలేదు అంటే ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.. సాహో సినిమా పరాజయం తర్వాత తాను చేయబోయే సినిమా లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు..బడ్జెట్ ఒక్కటే కాదు సినిమా లో మ్యాటర్ ఉండాలని ప్రభాస్ ఆలోచన.. అందుకే సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు అని భావిస్తున్నారు..

ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్సినిమా ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..

సినిమా బడ్జెట్ పై ఇప్పుడు అంతటా చర్చించుకుంటున్నారు.. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్లని అన్నారు. నిర్మాత స్వయంగా చెప్పాడంటే నిజమే అనుకోవాలి. ఖర్చు పెట్టినా పెట్టకపోయినా అధికారికంగా అయితే ఆ బడ్జెట్టే ఖరారవుతుంది. ఒక భారతీయ సినిమా మీద ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం అన్నది అనూహ్యమైన విషయం. అంతగా ఖర్చు చేసి ఎలాంటి సినిమా తీస్తారన్నది ఉత్కంఠ రేకెత్తించే విషయం. కాగా.. అశ్విన్ సినిమా కంటే ముందు ప్రభాస్ ‘ఆదిపురుష్’ చేస్తాడని దత్ క్లారిటీ ఇచ్చారు. ఆ చిత్రం జనవరిలో మొదలై ఆరు నెలల్లో పూర్తవుతుందని.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేయడానికి ప్రభాస్‌కు ఏడాదికి పైగా సమయం పడుతుందని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: