హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న తాజా మోవీ రంగ్ దే. కుర్ర దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొన్న ఒక షెడ్యూల్ షూటింగు హైదరాబాద్‌ లో పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూట్ కోసం ఈ టీం అంతా ఇటలీకి వెళ్ళాలని ప్లాన్ చేసినట్టు గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఈ నెలాఖరున అక్కడికి వెళ్లడానికి యూనిట్ అంతా ప్లాన్ చేసుకున్నారు.  అయితే ప్రభాస్ సినిమా దెబ్బకి ఈ సినిమా ప్లాన్ మార్చినట్టు తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాలో రెండు పాట‌ల‌తో పాటు కొద్ది పాటు షూట్ మిగిలి ఉంది. దీంతో ఆ రెండు పాట‌ల కోసం చిత్ర యూనిట్ ఇట‌లీకి ఈరోజు ప‌య‌న‌మ‌య్యేందుకు అంతా రెడీ అయింది. అయితే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా యూనిట్ అంతా షూట్ కోసం అక్కడే ఉంది. ఈ సినిమా యూనిట్ షూట్ ఆపేసి వెనక్కు రావలసి ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఇటలీ ప్లాన్ వీళ్ళు వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు.
 
అయితే ఇటలీ టూర్ క్యాన్సిల్ అయిన నేప‌థ్యంలో ముందుగా ప్లాన్ చేసిన ఇదే షెడ్యూల్ ని దుబాయ్ లో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ టీమ్ అంత దుబాయ్ వెళ్ల‌నున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూట్ పూర్తి కాకముందే ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే మరి ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: