విలన్ నుంచి హీరో గా మారిన గోపీచంద్ హీరో గా మంచి పునాదులు వేసుకున్నాడని చెప్పొచ్చు.. మొదట ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుని ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ ని బాగానే ప్లాన్ చేసుకున్నాడని చెప్పొచ్చు. అయితే గోపీచంద్ కి గత కొన్ని సినిమాలుగా భారీ ఫ్లాప్ లే అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో అయన ప్రస్తుతం చేస్తున్న సిటీ మార్ అనే సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.. ఈ నేపథ్యంలో గోపీచంద్  తన తదుపరి సినిమాను తేజ దర్శకత్వంలో చేయబోతున్నాడని వార్తలు వుతున్నాయి.

దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమా తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చినా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన సీత సినిమా దారుణ ఫలితాన్ని మిగిల్చింది. కాజల్ ప్రధాన పాత్ర గా తెరకెక్కిన ఈ సినిమాలో బెల్లంకొండ ని ఎందుకు హీరోయిన్ గా పెట్టారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి.. ఈ సినిమా ఫ్లాప్ తో తేజ కి సినిమాలు లేకుండా పోయాయి.. దాంతో మళ్ళీ హీరో ని వెతికే పనిలో పడ్డాడు తేజ. కరోనా తరువాత ప్రతి చిన్న హీరో, ప్రతి ఫ్లాప్ డైరక్టర్ కు కూడా సినిమాలు వస్తున్న నేపథ్యంలో తేజ లాంటి డైరెక్టర్ కి ఆఫర్ రావడం పెద్ద విశేషమేం కాదు. అయితే సినిమా సినిమా కి అందరు ఎదుగుతూ పోతుంటే తేజ మాత్రం తగ్గుతూ పోతున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో పీపుల్స్ మీడియా ఓ సినిమాను గోపీచంద్ తో ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకి తేజ దర్శకుడుగా అనుకుంటున్నారు.  గతంలో పీపుల్స్ మీడియా భాగస్వాములకు హోరా హోరీ అనే ఫ్లాపును కూడా గిఫ్ట్ గా ఇచ్చి వున్నాడు.మొత్తానికి వేరే వాళ్ల కథ ఒకటి తీసుకుని, తేజ డైరక్షన్ లో గోపీచంద్ తో పీపుల్స్ మీడియా సినిమా చేస్తుందట.మరి సొంత కథలను నమ్ముకుని చేసే తేజ వేరే కథతో సినిమా చేయడం విశేషంగానే చెప్పుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: