దాంతో ఈసారి రజని నుంచి కొత్త పార్టీ వార్త హల్చల్ చేయబోతోందని మీడియాలో గుప్పుమంది. కార్తీక సోమవారం రోజున తాను స్వయంగా నిర్మించిన రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఫాన్స్ తో మీట్ ఏర్పాటు చేశారు. రజిని పిలుపు అందుకున్న తమిళనాడులోని వాడవాడల నుంచి అభిమానులు వెల్లువెత్తారు. వారిలో కొంతమంది రజిని ఇంటి ముందుకొచ్చి జై జై నాదాలతో పాటు ఓ షరతు విధించి రజిని కాళ్లకు బంధం వేశారు. కొత్త పార్టీ అయితే ఒకే కానీ కాషాయదళంతో కలిసి రాజకీయాలు చేస్తామంటే తాము అంగీకరించమని బాహాటంగా నినదించారు. తమిళనాడులో ఎప్పటినుంచో రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాలని ఎంతగానో ఉవ్విల్లూరుతున్న కమలం పార్తీ ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వానికి తెరవెనుక నుంచి వ్యూహరచన చేస్తూ వస్తోంది. అంతేకాదు...గతంలో రజినీని తమ పార్టీకి అండగా నిలువాల్సిందిగా విత్రిది కూడా తెచ్చింది.
ప్రస్తుతం రజిని రాజకీయ అరంగేట్రం గురించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అభిమానులు మాత్రం సూపర్ స్టార్ కి గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. అభిమానులతో సమావేశం తర్వాత రజిని ఈ బాట ఎంచుకుంటారో ఉత్కంఠ గానే ఉంది. ఈ లోపున జయలలలిత నెచ్చెలి శశికళ బెంగళూర్ జైలు నుంచి రిలీజ్ అవుతారన్న సమాచారం కూడా తమిళ రాజకీయాలని హీటెక్కిస్తున్నాయి. వచ్చే ఏడాది తమిళ నాట ఎన్నికల సంవత్సరం. ఇప్పటినుంచే పొలిటికల్ హీట్ అన్ని పార్టీలని తాకుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని ఎన్నికల సిత్రాలున్నాయో? వేచి చూడాల్సిందే.