ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...గత కొంతకాలంగా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సినిమా చెయ్యబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉంటుందని మాటలు వినిపించాయి. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అని తెలియగానే ఫ్యాన్స్ చాలా సంతోషాపడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే..  ‘కె.జి.ఎఫ్’ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సోమవారం ఒక కీలక ప్రకటన చేసింది. తాము నిర్మించబోతున్న మరో భారీ పాన్ ఇండియా మూవీ వివరాలను డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు వెల్లడిస్తామని ప్రకటించింది. అయితే, ఇది ‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా గురించేనని సమాచారం.


ఈ మేరకు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి సమాచారం వస్తోంది.ప్రశాంత్ నీల్ నెక్ట్స్ మూవీ ప్రభాస్‌తో గానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో గానీ ఉండబోతుందని ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి. దీని గురించి సోషల్ మీడియాలో ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఆరా తీసినా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ పూర్తిచేసేంత వరకు తన తరవాత సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేనని ప్రశాంత్ స్పష్టం చేశారు.
అయితే, ఇప్పుడు దానికి సమయం వచ్చిందని  అంటున్నారు.


సోమవారం హోంబలే ఫిలింస్ చేసిన ప్రకటన దీని గురించే అని టాక్.‘‘ప్రియమైన ప్రేక్షకుల్లారా, మీరెప్పుడూ మాకన్నా మా సినిమానే ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ ప్రేమను ఇలానే పొందడానికి మరో సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఇది ‘ఇండియన్ ఫిలిం’. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2:09 గంటలకు వచ్చే మా ప్రకటన కోసం వేచి చూస్తూ ఉండండి’’.అని సోషల్ మీడియా వేదికగా తెలిపింది...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: