ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న చందమామ బ్యూటీ కాజల్ ఎంతో మంది కుర్రాళ్ల హృదయాలను గాయపరిచింది. అయితే తన మనసుకు నచ్చినవాడితో జీవితం పంచుకున్నందుకు కాజల్ మాత్రం ఎంతో సంతోషంగా ఉంది. ఫుల్ జోష్‌తో మాల్దీవుల్లో హనీమూన్ కూడా పూర్తి చేసుకున్నారు. సముద్రం మధ్యలో లంచ్, అండర్ వాటర్‌లో ఫస్ట్ నైట్ చేసుకుని బీచ్‌ల్లో ఎంజాయ్ చేశారు. అతేకాదు తన హనీమూన్‌ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే పెళ్లి తరువాత నటించడంపై కాజల్ పూర్తి క్లారిటీతో ఉంది. దీనికి ఆమె భర్త గౌతం కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.

ఇప్పటికే నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్న కాజల్.. వాటిని త్వరగా పూర్తి చేయాలని అనుకుంటోంది. వీటితో పాటు తమిళంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో భారతీయుడు-2, విజయ్‌తో ఓ సినిమాలకు రెడీ అవుతున్నారు. వీటితో పాటు దుల్కర్ సల్మాన్‌తో `హే సినామికా`లోనూ కాజల్ నటించనుంది. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దర్శకత్వం వహించనుండడం విశేషం. ఓ హారర్ చిత్రం కూడా రన్నింగ్‌లో ఉంది. అయితే ఇవన్నీ షూటింగ్స్ ప్రారంభం కావల్సి ఉంది. దీంతో ఆయా చిత్ర నిర్మాతలు, దర్శకులతో మాట్లాడేందుకు తరచుగా చెన్నై టూ హైదరాబాద్ తెగ తిరిగేస్తున్నారట.

ఇక టాలీవుడ్‌లో ఆచార్య చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా చేస్తున్నారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి కావల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయింది. కొద్ది రోజుల క్రితం షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ చిరంజీవి కరోనా బారిన పడడంతో అర్థాంతరంగా షూటింగ్ ఆపేశారు. అయితే ఆయన కోలుకోవడంతో షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఇక కాజల్ షెడ్యూల్ ఎప్పుడనేది తెలియాల్స ఉంది. ఆ క్లారిటీ రాగానే ఆచార్య బృందంతో కాజల్ జాయిన్ అవుతారు.

వీటితో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌లలో కొత్త కథలనూ కాజల్ వింటున్నారట. అంటే ఇప్పట్లో కాజల్ సినిమాల నుంచి రెస్ట్ తీసుకునే అవకాశమే లేదు. ఈ విషయం ఆమె అభిమానులకు ఆనందం కలిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: