టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెలుగు సహా పలు ఇతర భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కానున్న ఈ సినిమా పై మనదేశ ప్రేక్షకులతో పాటు విదేశాల్లో ఉన్న ఎందరో ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ పూర్తికాగా అతి త్వరలో సినిమా తదుపరి షెడ్యూలు ప్రారంభించనుంది మూవీ యూనిట్.
దానికోసం మహాబలేశ్వరం ప్రాంతాన్ని ఎంచుకున్న మూవీ యూనిట్ కొద్దిసేపటి క్రితం ఇద్దరు హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి అక్కడ స్పాట్లో తీసిన ఒక వీడియో ని తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశారు ఆర్ఆర్ఆర్ యూనిట్ వారు. ప్రస్తుతం ఆ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా అధికారిక ట్రైలర్ జనవరి 1న రిలీజ్ కానుందని అలానే సినిమా వచ్చే ఏడాది వేసవి తరువాత రిలీజ్ కానున్నట్లు సమాచారం.....!!