మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని కూడా ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా గురి తప్పకూడదని చాలా జాగ్రత్తపడుతున్నారట చిత్రయూనిట్.

మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమా తర్వాత హిట్టు కొట్టలేదు సినిమాలైతే చేస్తున్నాడు కాని ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. అందుకే క్రాక్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. క్రాక్ సినిమాలో శృతి హాసన్ గ్లామర్ సైడ్ కూడా అదరగొడుతుందని తెలుస్తుంది. ప్రస్తుత్మ గోవా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను అలరించేలా ఉంటుందని తెలుస్తుంది.

సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. మారుతి డైరక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని అన్నారు. అయితే ఆ సినిమా గురించి మాత్రం అఫీషియల్ న్యూస్ బయటకు రావట్లేదు. మాస్ రాజా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాలు అది సాధ్యపడేలా చేస్తాయో లేదో చూడాలి. రవితేజ మాత్రం ఈ సినిమాల కోసం చాలా కష్టపడుతున్నాడు. తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిద్దాం. క్రాక్ ను 2021 సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.                                                      



మరింత సమాచారం తెలుసుకోండి: