ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్న హీరోలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు  సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.గీతగోవిందం ఫేమ్  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రేక్షకుల్లో.  సోషల్ మెసేజ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతున్న ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.




 అయితే ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సర్కారీ వారి పాట సినిమా జనవరి నెలలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఏ సినిమా చేయబోతున్నాడు అనే దాని పై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.  అయితే సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ ఈ సినిమా ఇప్పట్లో తెరకెక్కే అవకాశం లేనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే గతంలో చేయాల్సిన వంశీ పైడిపల్లి సినిమా చేయాలనుకున్నప్పటికీ.. దర్శకుడు వంశీ పైడిపల్లి రామ్ చరణ్ తో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ   సినిమా పూర్తి కావాలంటే  మరో ఏడాది పడుతుంది.



 ఈ క్రమంలోనే సర్కారీ వారి పాట సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు సిద్ధమైనట్లు సమాచారం.  ఇప్పటికే దర్శకుడు వెంకీ కుడుముల సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసి కథ వినిపించగా కథ బాగా నచ్చడంతో మహేష్ బాబు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్న టాక్ వినిపిస్తోంది. సర్కారీ వారి పాట సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తవ్వగానే వెంకీ కుడుముల తో సినిమా సెట్స్ పైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారట మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: