కన్నడ స్టార్ యాష్ కెజిఎఫ్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించిన విషయం తెలిసిందే .. ఇప్పుడు అదే ఇండస్ట్రీ నుండి మరో పాన్ ఇండియా చిత్రం రాబోతుంది .. ఆ సినిమా ఏకంగా ఏడు భాషల్లో రూపొందబోతుంది .మరి ఆ సినిమా విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..

కన్నడ  స్టార్ హీరో  ఉపేంద్ర నటిస్తోన్న మూవీ కబ్జా  పాన్ ఇండియా మూవీకి ఏడు భాషల్లో రూపొందబోతుంది   ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్లో కన్నడలో బ్రహ్మ , ఐ లవ్యూ  యు  సినిమాలు వచ్చాయి. ఇక  వీరిద్దరి  కాంబినేషన్లో వస్తోన్న కబ్జా మూవీ మూడో చిత్రం కావడం విశేషం..

అయితే మూవీ టీం  రెండు రోజుల క్రితం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది . ఇందులో  U + ? అని రాసి.. క్వశ్చన్ మార్క్‌లో ఉండేది  ఎవరో  కనుక్కోండి అని ప్రేక్షకులకు టెస్ట్  పెట్టింది . అందులో ఉన్న U అంటే చిత్ర కథానాయకుడు ఉపేంద్ర అనేది స్పష్టంగా తెలియగా.. క్వశ్చన్ మార్క్ ఎవరి కోసం అనే చర్చ జరిగింది. అయితే ఆ  మార్క్ స్థానంలో చాలామంది  హీరోయిన్ పేరు అయ్యుండొచ్చని  భావించారు. కానీ, అందరి ఊహాగానాలకు  తెర దించుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ క్వశ్చన్ మార్క్ స్థానం లో ప్రేక్షకులకి షాక్ ఇస్తూ ని మూవీ టీం  కిచ్చా సుదీప్ అని రివీల్ చేసింది  . ఈ మేరకు  సుదీప్  లుక్ పోస్టర్  కూడా వదిలారు. భార్గవ్ భక్షి అనే పాత్రను కిచ్చా సుదీప్ ఈ సినిమాలో  పోషిస్తున్నారు.

అయితే ఉపేంద్ర , సుదీప్ ఇంతకుముందు ‌"ముకుందా మురారి చిత్రం"  లో కలిసి  నటించారు. ఇదే సినిమాను  తెలుగులో ‘గోపాల గోపాల’గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను కన్నడలో సుదీప్ చేశారు. అయితే, ఇప్పుడు చేసే కబ్జా సినిమా దానికి పూర్తి వైవిధ్యమైన సినిమా.

సినిమా ద్వారా దర్శకుడు  ప్రేక్షకులను  1947 కాలానికి  తీసుకెళ్లబోతున్నారు.   అండర్ వరల్డ్‌ నేపథ్యం లో కబ్జా సినిమా ఉండబోతున్నట్లు సమాచారం .. కబ్జా  సినిమాను మొత్తం ఏడు భాషల్లో రూపొందించగా అందులో  తెలుగు కూడా ఒకటి. కాగా, కెజిఎఫ్  చిత్రానికి  మ్యూజిక్ ఇచ్చిన  రవి బస్రూర్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నారు. .లాంకో శ్రీధర్ సమర్పణలో శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌‌ప్రైజస్ బ్యానర్‌పై ఆర్. చంద్రశేఖర్, మునింద్ర కె. పురా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: