సాయి దరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్నతొలి చిత్రం ‘ఉప్పెన’. చాలారోజుల క్రితమే అన్ని పనులు ముగించుకుని సిద్ధంగా ఉన్న ఈ చిత్రం లాక్ డౌన్ ఎఫెక్ట్ మూలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆ మద్య ఈ సినిమా ఓటిటి వెళ్తుందంటూ బాగా ప్రచారం జరిగిన చివరకి థియేటర్స్ లో విడుదల చేసేందుకే మొగ్గు చూపారు. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకోవడంతో పాటు తాజాగా విడుదలైన సినిమాలు మంచి ఫలితాలను రాబట్టడంతో " ఉప్పెన " సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు చిత్రా యూనిట్. 

ఇందులో భాగంగానే సంక్రాంతి కానుకగా టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. భావోద్వేగపూరితమైన మాటలు, మంచి సంగీతం, ఆకట్టుకునే విజువల్స్ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఇది ఫీడ్ గుడ్ మూవీ అనే అభిప్రాయాన్ని కలిగించాయి. దీంతో ఈ టీజర్ పై ప్రశంశల వర్షం కురుస్తుంది. 

తాజాగా  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా టీజర్ చూసి  ఇంప్రెస్ అయ్యినట్టు తెలుస్తుంది. టీజర్ చాలా అందంగా ఉందని, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ బాగుంది అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకానుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: