ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఆడవాళ్ల పెత్తనం ఎక్కువైపోయిందట. హీరోల విషయంలో వాళ్ల భార్యల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని డామినేషన్ అనాలో.. జాగ్రత్త తీసుకుంటున్నారు అనాలో ఎవరికీ అర్థం కావడం లేదు. టాలివుడ్ సినిమాల్లో హీరోల భార్యల పెత్తనం ఎక్కువైపోయిందని నిర్మాతలు నెత్తీనోరు బాదుకుంటున్నారు. అన్నింటిలో భార్యల ఇన్వాల్వ్ మెంట్ తో నిర్మాతలు భయపడుతున్నారని సమాచారం.
మహేష్ బాబు,
పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు పారితోషకం భారీగా పుచ్చుకుంటున్నారు. దాదాపు 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు తీసుకుంటున్నారని ఫిల్మ్
నగర్ టాక్. అయితే నిర్మాతలు హీరోల భార్యల ఆధిపత్యంతో కొంత ఇబ్బందిగా ఫీలవుతున్నారట. ఈ విషయంలో తెలుగు సినీ
పరిశ్రమ లో
మహేష్ బాబు
భార్య నమ్రతా శిరోద్కర్ ముందుంటుంది.
మహేష్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని నమ్రతే దగ్గరుండి మరీ చూసుకుంటుంది.
మహేష్ కూడా మొత్తం
నమ్రత కే అప్పచెబుతాడు కూడా.
మహేష్ తో
సినిమా చేయాలంటే
నమ్రత ఓకే చెప్పాలట. లేదంటే ప్రాజెక్టు పట్టాలెక్కదు. కథలో కూడా
నమ్రత జోక్యం ఉంటుంది. ఆమె సూచనలు ఇస్తుందనే ప్రచారం జరుగుతుంది.
నమ్రత తీరుతో కొందరు నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తారనే వార్తలు కోడై కూస్తున్నాయి. ఇక
నాగ చైతన్య కెరీర్ విషయంలో
సమంత ముందు కాస్త చూసి చూడనట్టుగా వ్యవహరించిన, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కథల విషయంలో ఆమె ఒకే చెప్పకుండా చైతు ఒక్క అడుగు కూడా ముందుకేయడం లేదట. ఇక
రాజశేఖర్ భార్య జీవిత కూడా అంతే. ఆమె ఎస్ అంటే ఎస్ నో అంటే నో.
సినిమా కథ నుండి క్యాస్టింగ్ వరకు అన్ని
జీవిత చెప్పినట్టుగానే నడుస్తాయి.. ఇలా ఉంటుంది
హీరో రాజశేఖర్ కండిషన్. కేవలం వీరు మాత్రమే కాదు.. మరికొందరి
తెలుగు హీరోల భార్యలు కూడా ఇదే చేస్తున్నారని టాక్.