ఈ సినిమా షూటింగ్ షురూ అయినప్పటినుంచి కూడా థమన్ రెగ్యులర్ గా ఈ మూవీ అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా కూడా థమన్ ఓ ఫోటోను లీక్ చేసాడు. గత కొన్ని రోజుల కిందటే ‘సర్కారు వారి టీం’ అంతా కలిసి దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక దుబాయ్ లో కొన్ని రోజులుగా జరిగిన షెడ్యూల్ కంప్లీట్ అయిన సంగతి కూడా తెలిసిందే. కాగా ఈ విషయాన్నే థమన్ వెళ్లడిస్తూ .. సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. కోవిడ్ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నాడు థమన్.
అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు ది తాజా ఫోటో కూడా షేర్ చేశాడు. ఈ పిక్ ప్రిన్స్ బ్యాక్ సైడ్ వ్యూ లో కనిపిస్తూ.. మొహానికి క్లాత్ కట్టుకుని కనిపిస్తున్నారు. ఈ మధ్యనే దుబాయ్ లో షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ చిత్ర యూనిట్ అంతా హైదరాబాద్ చేరుకుంది. అతి త్వరలోనే మరో షెడ్యూల్ ను ప్లాన్ చేసే పనిలో పడ్డారట డైరెక్టర్ పరశురాం. అక్కడే హీరో హీరోయిన్ మధ్యన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించి.. ఓ పాటను కూడా షూట్ చెయ్యడానికి ప్లాన్ వేశారట డైరెక్టర్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.