ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి ఇప్పుడు వరుస సినిమా ఆఫర్స్ ను దక్కించుకుంటుంది. ఇప్పటికే రెండు చిత్రకు సైన్ చేసిన కృతి ఆ తర్వాత చేయబోయే సినిమాకు మాత్రం ఒక కండిషన్ పెడుతుంది మరి ఆ కండిషన్ ఏంటి ఉప్పెన హీరోయిన్ గా ఆమె ఎలా సెలెక్ట్ అయ్యిందో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఉప్పెన చిత్రం కరోనా కంటే ముందే షూటింగ్ ప్రారంభం అయ్యిన ఇక అప్పుడు విడుదలైన ఒక పాట తెగ వైరల్ అయ్యింది ఆ పాటేంటో మీకు కూడా తెలుసు. అయితే ఆ పాట ఇచ్చిన కిక్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అనేలా ఆసక్తిని కలిగించిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత పరిస్థితి ఏమైయ్యిందో తెలుసు కరోనా తో దాదార్పు తొమ్మిది నెలలు లాక్ డౌన్ దేశం మొత్తం స్తంభించి పోయింది. ఆ తర్వాత పరిస్థితి సాధారణంగా మారడంతో మెల్లగా థియేటర్స్ మొదలైయ్యాయి. ఆలా ఫిబ్రవరీ 12 వ తేదీన విడుదలైన ఉప్పెన రికార్డు కలెక్షన్ ను సాధిస్తుంది. ఇందులోనటించిన హీరో మరియు హీరోయిన్స్ ఇద్దరు కొత్తగా పరిచయం కావడం విశేషం.

ఇప్పుడు హీరోయిన్ కృతి శెట్టి విషయానికి వస్తే, ఈమె ముంబై కి చెందిన నటి అయితే దర్శకుడు బుచ్చి బాబు ఉప్పెన సినిమాకి హీరోయిన్స్ కోసం చాలా మందిని ఆడిషన్స్ ని నిర్వహించామని అందులో కృతి సెలెక్ట్ అయ్యిందని ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. కృతి కంటే ముందు ఒక హీరోయిన్ అనుకున్నామని కానీ ఎందుకో పాత్రకి ఆమె సెట్ అవ్వక చివరికి కృతిని తీసుకున్నామని దర్శకుడు తెలిపాడు.

ఇక ఉప్పెన సినిమాలో కృతి నటనకి మంచి మార్కులే పడ్డాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక మాట అన్నారు అదేంటంటే ఉప్పెన సినిమా విడుదలైతే ఈ అమ్మాయి మళ్ళీ మీకు దొరకదు ఇప్పుడే ఎవరైనా హీరోయిన్ కావాలంటే ఈ అమ్మాయి డేట్స్ తీసుకోండి అని అన్నారు. అయన అన్నట్లుగానే కృతి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టడం విశేషం. కానీ అమ్మడు తనకి వస్తున్న అవకాశాల చూసి అమాంతం రెమ్యూనరేషన్ ను పెంచేసింది. తనకి అరవై లక్షలు ఇస్తేనే సినిమాకి సైన్ చేస్తానని కృతి అంటోంది. అయిన కూడా తన నటన చూసిన దర్శకనిర్మాతలు ఆమె చెప్పిన దానికి ఒప్పుకొని  మరి తమ సినిమాలో హీరోయిన్ కోసం డేట్లు తీసుకుంటున్నారు. ఇదండీ  కృతి ప్రయాణం చేసిన ఒక్క సినిమాకే తనకి ఎంతటి పేరును తీసుకొచ్చిందో చూసారు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: