ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాతో పాటే చెర్రీ కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో చెర్రీ ఓ కీలక పాత్రలో కనిపించున్నాడు. ఈ మూవీల తర్వాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ ఓ సినిమాలో నటించనున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమా షూటింగులు కంప్లీట్ అయిన తర్వాతే శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలస్తోంది. సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడే ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు మెగా అభిమానులు.
ఇక చరణ్, శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందన్న వార్త అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన వార్తలే తెగ వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త సోషల్ మీడియాను దున్నేస్తోంది. ఈ సినిమా మార్క్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ  విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఒకే విషయంపై చర్చ జరుగుతోంది. ఇందులో మెగా పవర్ స్టార్ సనసన ఏ హీరోయిన్ నటించబోతుందని.

అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం మేరకు ఇందులో సౌత్ కొరియాకు చెందిన బేసుజీ అనే హీరోయిన్ నటించబోతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాలో ఈ చిన్నదే హీరోయిన్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సెన్సెషన్ డైరెర్టక్ శంకర్ చరణ్ తో మరో సెన్సెషన్ క్రియేట్ చెయ్యడానికే సౌత్ కొరియా భామను సెలక్ట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. వీలైనంత తొందరలోనే ఈ పాన్ ఇండియా సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: