ఇక చరణ్, శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందన్న వార్త అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన వార్తలే తెగ వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త సోషల్ మీడియాను దున్నేస్తోంది. ఈ సినిమా మార్క్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఒకే విషయంపై చర్చ జరుగుతోంది. ఇందులో మెగా పవర్ స్టార్ సనసన ఏ హీరోయిన్ నటించబోతుందని.
అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం మేరకు ఇందులో సౌత్ కొరియాకు చెందిన బేసుజీ అనే హీరోయిన్ నటించబోతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాలో ఈ చిన్నదే హీరోయిన్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సెన్సెషన్ డైరెర్టక్ శంకర్ చరణ్ తో మరో సెన్సెషన్ క్రియేట్ చెయ్యడానికే సౌత్ కొరియా భామను సెలక్ట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. వీలైనంత తొందరలోనే ఈ పాన్ ఇండియా సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి.