ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు మాంచి జోరు మీదున్నారు. మొన్ననే ఉప్పెన సినిమా తో హిట్ కొట్టి ఇప్పుడు ఒకపక్క బన్నీతో పుష్ప సినిమా అలానే మరోపక్క మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఇవి కాక వీళ్ళు మరిన్ని సినిమాలు కూడా లైన్ లో పెట్టారు. కొన్ని కథల దశలో ఉంటే మరికొన్ని మాత్రం నెమ్మది నెమ్మదిగా ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. అలాంటి వాటిలో కళ్యాణ్ రామ్ సినిమా ఒకటి. ఈ సినిమా మొన్నీమధ్య పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. కొత్త దర్శకుడు రాజేంద్ర ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

 అయితే ఈ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ వెలుగు లోకి వచ్చింది. అదేమంటే సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయల మేర బడ్జెట్ పెడుతున్నట్టు చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ మార్కెట్ కి ఈ బడ్జెట్ దాదాపు రెండింతలు అని చెబుతున్నారు. అయితే ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించే మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు కళ్యాణ్ రామ్ సినిమా కోసం ఎంత బడ్జెట్ పెడుతున్నారో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వెల్లడి కాలేదు. కేవలం సినిమా హీరో అలాగే దర్శకుడు నిర్మాతలకు సంబందించిన వివరాలు మాత్రమే వెల్లడయ్యాయి.

హీరోయిన్, ఇతర నటీ నటులు, ఇతర క్రూ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇక మైత్రీ వాళ్ళు బడా హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి మాత్రమే వెలువడింది. త్వరలోనే మిగతా వాటి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: