సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి హీరోయిన్గా ఎదిగింది. కానీ ఆ గుర్తింపు చాలా కాలం నిలవలేదు. బొద్దుగా తయారుకావడంతో హీరోయిన్ పాత్రలకి స్వస్తి చెప్పి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయ్యింది. కోలీవుడ్లో స్టార్ హీరో విజయ్ సర్కార్, విశాల్ పందెంకోడి 2లో విలన్గా మారి ఆదరగొట్టింది. ఇక అదే ఊపులో టాలీవుడ్లోకి అడుగుపెట్టి సందీప్ కిషన్తో తెనాలి రామకృష్ణ సినిమాతో విలన్గా మంచి పేరు తెచ్చుకున్నారు.
క్రాక్ సినిమాలో ఆమె చేసిన జయమ్మ పాత్ర ఆమెకు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ తన పెర్ఫార్మెన్స్తో టాలీవుడ్ లో లేడీ విలన్ లేని లోటుని భర్తీ చేసింది. ఇక తాజాగా నాంది సినిమాలో పవర్ఫుల్ లాయర్గా ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టులో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రలో వరలక్ష్మి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
దీనికి సంబందించి త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్టటికే సర్కార్ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్కు పోటీగా ఇలాంటి పాత్రలోనే నటించిన వరలక్ష్మి అదరగొట్టారు. ఇప్పుడు మన అల్లు అర్జున్ సినిమాలో కూడా అలాంటి పాత్రలోనే చేయనుండడం గమనార్హం.