అక్కినేని హీరోలు ఫుల్ హుషారుతో సినిమాల జోష్ ను పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వాటిని ఒక్కొక్కటిగా తెరపైకి ఎక్కించే పనిలో  పడ్డారు అక్కినేని ఫ్యామిలీ హీరోలు. ఈ సినిమాలతో తమ ఫ్యాన్స్ ను ఫుల్ గా ఎంటర్ టైన్మెంట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. వరుసగా అక్కినేని హీరోలు ఒకరి తర్వాత ఒకరు థియేటర్లలో సందడి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న సినిమాలు అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. అయితే గతేడాది ఒక్క సినిమాను కూడా రిలీజ్ చెయ్యని అక్కినేని నాగర్జున్ ఈ ఏడాది సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పోయిన ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 లో హోస్ట్ గా వ్యవహరించి ఫుల్ బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరో ప్రస్తుతం‘వైల్డ్ డాగ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ట అక్కినేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ సినిమా ఈ మధ్యనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. అతి తొందరలోనే ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫాం పై రిలీజ్ కానుంది. ఇక నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య  కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించింది. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పట్ల ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి.

మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2 న రిలీజ్ కాబోతుందని ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక అక్కినేని చిన్న హీరో అఖిల్ కూడా లీస్ట్ లోనే ఉన్నాడు. మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న హీరో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కాగా ఈ సినిమాసంక్రాంతి బరిలోనే దిగాల్సి ఉంది. కానీ సంక్రాంతి బరిలో హెవీ కాంపిటీషన్ ఉండటంతో ఈ బ్యాచిలర్ రిలీజ్ డేట్ ను మార్చేశాడు. అయితే తాజా సమాచారం మేరకు అక్కినేని అఖిల్ తన సినిమాతో మే నెలలో తెరముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు మొనగాళ్లు వరుసగా థియేటర్లలో సందడి చేయనున్నారు. మరి ఎవరు బాక్సాఫీస్ కింగ్ గా నిలుస్తారోనని అక్కినేని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: