టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు.. అయితే తాజాగా ఈ హీరో విషయంలో ఇద్దరు అగ్ర దర్శకుల మధ్య క్లాశేష్ వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో పలు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ విషయం ఏమిటంటే.. సినిమాల విషయంలో ఒకే స్టార్ హీరోని నలుగురైదురు ట్రై చేస్తూంటారు. అందులో ఒకరికే ఛాన్స్ వస్తుంది. మిగతా వాళ్లు వెయిట్ చెయ్యాల్సి ఉంటుంది. వెయిట్ చెయ్యకుండా ప్రక్కకు వెళ్లి వేరే సినిమా చేద్దామంటే మళ్లీ ఆ స్టార్ హీరో దొరుకుతాడో లేడో అని తెలియక లైన్ లో వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ వెయిలింగ్ లిస్ట్ ఎంతటి వారికైనా విసుగు రప్పించేదే. ఇప్పుడు త్రివిక్రమ్ వల్ల అనీల్ రావిపూడి వెయిటింగ్ లిస్ట్ లో పడాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఎఫ్ 3 బిజీలో ఉన్న అనీల్ రావిపూడి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఓ స్టోరీ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఫుల్ స్క్రిప్టు లాక్ చేసి సెప్టెంబర్ నుంచి షూట్ కు వెళ్ళిపోదామనుకున్నాడు. అయితే సీన్ లోకి ఊహించని విధంగా త్రివిక్రమ్ వచ్చేసాడు. ఎన్టీఆర్ కొన్ని కారణాలతో త్రివిక్రమ్ తో వద్దనుకుని కొరటాల శివతో చేస్తున్నాడు. దాంతో ఎన్టీఆర్ తో అనుకున్న ప్రాజెక్టు ప్రక్కకు వెళ్ళటంతో త్రివిక్రమ్ ఇటు స్టెప్ వేసాడు. ఇక్కడ ఆల్రెడీ కర్చీప్ వేసుకుని కూర్చున్న అనీల్ రావిపూడి లేచి చోటు ఇవ్వాల్సి వచ్చింది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో గతంలో అతుడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా సినిమా రాలేదు. దాంతో మహేష్ చాలాకాలంగా త్రివిక్రమ్ తో చేద్దామనుకున్నా కుదరటంలేదు.

ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. పెద్ద హిట్ కొట్టేదాకా వెనకడుగు వేసేది లేదన్నట్లు ముందుకు వెళ్తున్నారు.త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో మొదలయ్యే సినిమా ఆగస్టు నుంచి మొదలవుతుందని సమాచారం. ఈ సినిమా పూర్తవగానే రాజమౌళితో ఉంటుంది. ఆ సినిమా 2022 మధ్యలో లాంచ్ అవుతుంది. దాంతో ఎక్కడా మహేష్ తో చేయటానికి అనీల్ రావిపూడికు గ్యాప్ అనేది లేదు.ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి ఎన్ని మార్పులు వస్తాయో...రాజమౌళితో చేసాక, ఏ స్దాయి ఇమేజ్ సెట్ అవుతుందో...అనే అప్పటి పరిస్దితులను బేరేజు వేసుకుని మహేష్ ఎవరితో ముందుకు వెళ్తాడు అనేదాన్ని బట్టి అనీల్ రావిపూడి సినిమా చేస్తాడా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: