మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లు సినిమా సినిమాకి డిఫరెంట్ స్టైల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు.. ట్రెడిషనల్ లుక్ లో ఉండే హీరోయిన్లు.. ఒక్కసారిగా మోడ్రన్ లుక్స్ లోకి చేంజ్ అయిపోతున్నారు.. అలా  ట్రెడిషనల్ లుక్ లో చూసిన హీరోయిన్లను ఒకేసారి మోడ్రన్ దుస్తులలో చూసేవారికి నిజంగా ఓ మెరుపులా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి మెరుపే మరో హీరోయిన్ లో కనిపించగా.. ప్రస్తుతం ఆమె స్టార్ స్థానంలో ఎదిగిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు..టాలీవుడ్ బ్యూటీ మహానటి కీర్తి సురేష్. ప్రస్తుతం ఈమె వరుస ఆఫర్లతో గా దూసుకుపోతుంది.

అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మొత్తానికి ఓ ఫేమ్ గా మారింది. ఇక ఈమె నటించిన సావిత్రి బయోగ్రఫీ లో ఈమె నటన ఎంతో ఆకట్టుకోగా మొత్తానికి మహానటిగా మారింది.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటుంది.ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు సన్నగా నాజూగ్గా తయారయింది. అంతేకాకుండా తన డ్రెస్సింగ్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం నటించిన సినిమాల్లో కూడా గ్లామర్ గా కనిపిస్తుంది ఈ బ్యూటీ.

 తెగ వర్కౌట్లు చేస్తూ తన శరీర బరువును తగ్గించుకొని మంచి గ్లామర్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా తన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేష్ అక్కడ దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో చేతి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని, మోడ్రన్ లుక్ తో బాగా ఆకట్టుకుంది. కీర్తి సురేష్ ఫోటో చూశాక మొత్తానికి స్టైలిస్ట్ ట్రెండ్ ఫాలో అవుతుందని అర్థమవుతుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది..ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది.. ఈ సినిమాతో పాటూ తమిళంలో, మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది కీర్తీ సురేష్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: