చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ నలుమూల నుండి ఆయనకు అభిమానులు ఉన్నారు. అయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్ సినిమా రికార్డు క్రియేట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో సినిమా షూటింగులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు టీనేజ్ లో ఒక కోరిక ఉండేదట అదేంటో చూద్దామా.

ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్ననాటి ప్రాణస్నేహితుడు డాక్టర్ సత్య ప్రసాద్. ఇప్పటికీ వీరి స్నేహం అలాగే ఉండగా.. పాఠశాల రోజుల నుంచి కాలేజీ వరకు వీరు కలిసి చదువుకున్నారట‌. ఇక చిరంజీవి యాక్టర్ గా, సత్య ప్రసాద్ డాక్టర్ గా సెటిల్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డాక్టర్ సత్య ప్రసాద్ చిరంజీవి గురించి, తన కుటుంబం గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ టీనేజ్ లో ఉన్నప్పుడు అతనిని అన్నయ్య అంటూ.. వదిలేవాడు కాదని తెలిపాడు సత్యప్రసాద్. ఆ తరువాత వయసులోకి వచ్చాక కాస్త బిడియం మొదలైందని, సిగ్గుపడుతూ మాట్లాడేవాడని తెలిపాడు. అయితే ఒకానొక సందర్భంలో మద్రాసులో వరదలు వచ్చి మునిగిపోయిన సమయంలో చిరంజీవి పవన్ కళ్యాణ్, సురేఖను తీసుకుని కారులో చుట్టాలింటికి బయలుదేరాడు.

అదే సమయంలో చిరంజీవి స్లమ్ ఏరియాలోకి పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్లి వాళ్లని చూడు తాగడానికి నీళ్లు కూడా లేవు. నువ్వేమో పొద్దున్నే బిర్యానీ కావాలని పేచీ పెట్టావంట‌ అని పవన్ కళ్యాణ్ తో ప్రాక్టికల్ గా చూపించాడట‌ చిరంజీవి. ఆ మాటలతో పవన్ కళ్యాణ్ లో మార్పులు రావడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని సర్వీసులు, డొనేషన్ లు చేస్తున్నారని సత్య ప్రసాద్ ఈ సందర్బంగా వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: