టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం "థాంక్యూ" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా  కరోనా సెకండ్ వేవ్ లోనూ ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.  ఇక్కడ కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ చిత్ర బృందం షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది . అయితే అక్కడ కూడా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆ వార్తలన్నీ పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది. తాజాగా చిత్ర యూనిట్ ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. అంతే కాకుండా తిరిగి ఇండియా కు వస్తున్నట్టు పేర్కొంది. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ ఫోటోలను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి . 

ఈ ఫోటోల్లో నాగచైతన్య , రాశీ ఖన్నా తో పాటు దర్శకుడు విక్రమ్ ఉన్నారు. ఈ ఫోటోలను రాశీఖన్నా సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , హర్షిత్ రెడ్డి, శిరీష్ లు  నిర్మిస్తున్నారు . ప్రస్తుతం కరోనా విజృంభన నేపథ్యంలో పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు అన్ని షూటింగ్ లను వాయిదా వేసుకున్నారు. కానీ థాంక్యూ సినిమా ఎక్కడా తగ్గకుండా షెడ్యూల్ ను పూర్తి చేసుకోవడం విశేషం . ఇదిలా ఉండగా నాగ చైతన్య ఇప్పటికే లవ్ స్టొరీ అనే సినిమాను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: