జబర్ధస్త్ బ్యూటీ అనసూయ ప్రస్తతం బుల్లి తెర జంట వెండి తెర పైనే బిజీగా ఉంది. స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తున్నప్పటికీ ఇదివరకు తో పోల్చుకుంటే తక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా అనసూయ కెరీర్లో రంగస్థలం సినిమా ఒక మైలు రాయిగా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమా కంటే కొన్ని సినిమాల్లో నటించినా.. ఐటమ్ సాంగ్స్ కి స్టెప్పులు వేసినా రాని క్రేజ్ రంగమ్మత్త క్యారెక్టర్ తో వచ్చింది. ఈ సినిమా తరవాత అనసూయ ను అంతా రంగమ్మత్త అనే పిలిచారు. అయితే అనసూయ ను రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలోనూ సుకుమార్ తో సహా మిగితా యూనిట్ సభ్యులు అత్తా అనే పిలిచేవారట. ఈ విషయాన్ని అనసూయ చాలా ఇంటర్వ్యూ లలో చెప్పింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని పంచుకుంది. అంతే కాకుండా ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు   కు తనకు మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి చెప్పింది. 

అనసూయ మాట్లాడుతూ.... రంగస్థలం సినిమా సమయంలో తనకు దర్శకుడు బుచ్చి బాబు ఎంతో క్లోజ్ అయ్యారని చెప్పింది. బుచ్చి కూడా తనను అత్తా అని పిలిచేవాడని చెప్పింది. షూటింగ్ సమయంలో ఇద్దరం సరదాగా గడిపేవాళ్ళని తెలిపింది. తన పర్సనల్ విషయాలను కూడా బుచ్చిబాబు తో పంచుకునే దాని అని తెలిపింది. ఇండస్ట్రీ లో తనకు ఎక్కువ క్లోజ్ ఉన్న వ్యక్తి కూడా బుచ్చిబాబునే అని  చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఓరోజు ఉప్పెన షూటింగ్ సమయంలో బుచ్చిబాబు తనకు ఫోన్ చేసారని చెప్పింది. మీ ఇంటిదగ్గరే ఉన్నామత్తా...విజయ్ సేతుపతి తో షూట్ చేస్తున్నామని చెప్పాడట. దాంతో అనసూయ వెంటనే షూటింగ్ స్పాట్ కు వెళ్లి విజయ్ సేతుపతి ని కలిసిందట. పిజ్జా సినిమా నుండే అనసూయ విజయ్ సేతుపతి అభిమానట. ఇక 96 సినిమా తరవాత రామ్ పాత్ర చూసి సేతుపతి అంటే ఇంకా అభిమానం పెరిగిందని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: