యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు ఆయన చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యాం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా కాకుండా ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా అనౌన్స్ చేశాడు. ఇవి కాక ఆయన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. 


అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే ఒక మాస్ సబ్జెక్టు కూడా చేస్తున్నాడు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ప్రభాస్ ఒక లేడీ డైరెక్టర్ చెప్పిన కథకు ఫిదా అయ్యాడు అని అంటున్నారు. ఈ డైరెక్టర్ మరెవరో కాదు ఇటీవలే సూర్యతో ఆకాశమే నీ హద్దురా అంటూ ప్రేక్షకులను పలకరించిన సుధ కొంగర. గతంలో వెంకటేష్ గురు సినిమా తీసిన ఆమె నిజానికి తెలుగువారే. కానీ ఎక్కువగా తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యారు. తాజాగా ఆమె ప్రభాస్ ను కలిసి ఒక కథ వినిపించారని ప్రచారం జరుగుతోంది. 


ఆ కథ ప్రభాస్ కు బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రమ్మని ప్రభాస్ కోరినట్లు సమాచారం. సోషల్ మెసేజ్ తో కూడిన కధాంశం కావడంతో ప్రభాస్ కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని ఒకసారి ఫైనల్ స్క్రిప్ట్ కనుక ఆయనకు నచ్చితే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి, ఉంది ఇది ఎంతవరకు ఫైనల్ అవుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: