కరోనాతో బయట అంతా కూడా గందరగోళంగా ఉంది. మరో వైపు టాలీవుడ్ లో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. చేయాల్సిన సినిమాలు పెండింగులో పడడం, షూటింగులు ఆగిపోవడం, కొత్త ప్రాజెక్టులు ముందుకు వెళ్లకపోవడంతో స్టార్ హీరోలు కొత్త ఆలోచనలు చేస్తున్నారు.

ఈ మధ్యన‌ కొందరు స్టార్ హీరోలు వరసగా కొత్త కాంబినేషన్లు సెట్ చేసుకున్నారు. అంతకు ముందు వారితో మూవీ అన్న డైరెక్టర్లు వేరే హీరోలతో సినిమాలను అప్పటికపుడు  ప్రకటించారు. ఇలా అంతా తారు మారు అయింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన సౌతిండియా బిగ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసి అందరికీ షాక్ తినిపించారు. ఈ ప్రాజెక్ట్ ఇపుడు ఒక్కసారిగా డైలామాలో పడింది.

దానికి కారణం శంకర్ లైకా ప్రొడక్షన్స్ వారి ఇండియన్ టూ సినిమాను మధ్యలో వదిలేయడమే. ఆ మూవీ కంప్లీట్ చేస్తే తప్ప కొత్త ప్రాజెక్టులు వద్దు అంటోంది లైకా ప్రొడక్షన్స్. దాంతో పాటు విశ్వనటుడు కమల్ హాసన్ ఈ మూవీలో హీరో. ఆయన ఈ మూవీని మళ్ళీ పట్టాలెక్కించేందుకు చూస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇండియన్ టూ కంపల్సరీగా  శంకర్ చేయాల్సిందే.

అలా కనుక చేస్తే కచ్చితంగా ఏడాది పై దాటుతుంది అది పూర్తి కావడానికి. మరి ఆర్.ఆర్.ఆర్ మూవీ తరువాత వెంటనే మూవీ చేయాలని ఆలోచిస్తున్న రామ్ చరణ్ ఏడాది పాటు ఖాళీగా ఉండలేరు కదా. అందుకే ఆయన ప్లాన్ బీ అంటూ కొత్తది బయటకు తీశారుట. దాంతో తరువాత వరసలో ఉన్న ఇద్దరు ముగ్గురు డైరెక్టరలో ఒకరికి ఓకే చెప్పి కొత్త సినిమాను ఈ గ్యాప్ లో పూర్తి చేయాలని చరణ్ ఆలోచిస్తున్నారు అంటున్నారు. అంటే శంకర్ చరణ్ కాంబో బయటకు రావాలంటే మరో ఏడాది పడుతుంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: