కరోనా వైరస్ సాఫీగా సాగి పోతున్న మనిషి జీవితం లో అల్లకల్లోలం సృష్టించింది.  అందరికీ ప్రాణం మీద తీపిని పెంచి అనుక్షణం ప్రాణ భయంతో బ్రతికే పరిస్థితి తీసుకు వచ్చింది.  ఇక ఇంకెంతో మంది జీవితాలను ఊహించనంత దుర్భరం గా మార్చేసింది.  ఎంతో మందికి కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి తీసుకు వచ్చింది.  ఇప్పటికి ఎంతో మంది సామాన్యులపై పగబట్టినట్లు గానే పంజా విసురుతోంది  ఈ మహమ్మారి కరోనా. కరోనా వచ్చినప్పటినుంచి పేద సామాన్య ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.



 ఉపాధి దొరక్క పస్తులుండే పరిస్థితిలో కూడా.. ప్రాణాలు కాపాడుకోవడానికి కరోనా వైరస్ తో పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది సామాన్య ప్రజలకు.  రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి లో పస్తులుంటున్నారు పేద మధ్యతరగతి ప్రజలు.  ఇక ఇలాంటి వారి కడుపు నింపడానికి ఎంతో మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు అటు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి విరాళాలు అందజేశారు.  మరికొంతమంది స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్లి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.  ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్ రాశి కన్నా గొప్ప మనసు చాటుకుంది.




 కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను చూసి హీరోయిన్ మనసు కరిగిపోయింది.  రోటి బ్యాంక్ అనే స్వచ్ఛంద సంస్థతో నిరుపేదల ఆకలి తీర్చడానికి సిద్ధమైంది. కేవలం తాను మాత్రమే సహాయం చేస్తే కొద్దిమందికే అందుతుందని..  మీరు సహాయం చేయాలనుకుంటే విరాళం అందించాలంటు కోరింది. అందరం కలిస్తే ఎంతోమందికి కడుపు నింపవచ్చు అంటూ  కోరింది రాశి ఖన్నా . దీంతో రాశి కన్నా కు చాలానే విరాళాలు వచ్చాయి. విరాళాలతో ప్రజల వద్దకు చేరుకుని ఏకంగా రోజు పన్నెండు వందల మంది కడుపు నింపుతుంది. రాశి కన్నా గొప్ప మనసుకు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: