మామూలుగా సినిమాల్లో ఒక స్టార్ హీరో ఎంట్రీ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. అభిమానుల అంచనాలకు మించి హీరో ఎంట్రీ ఉండటానికి భారీగా ఖర్చు చేస్తుంటారు మేకర్స్. వెనకాల ఎగిరే సుమోలు, కండలు తిరిగిన దేహంతో హెలికాఫ్టర్ మీద నుండి, లేదా ఏడైన భారీ ఫైట్ చేస్తూ ఎంట్రీ..? ఇలా రకరకాలుగా హీరో ఎంట్రీని ప్లాన్ చేసి అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తుంటారు డైరెక్టర్స్. అందుకు భారీ మొత్తంలోనే ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ సినిమాలో మాత్రం హీరో సంగతి ఏమో కానీ, విలన్ ఎంట్రీ కోసం మాత్రం ఏకంగా పది కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అయిపోయారట మేకర్స్. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటే...బాలీవుడ్ మూవీ టైగర్ 3.

ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తుండగా ప్రత్యర్ధి పాత్రలో ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్నారు.   ఈ సినిమాలో ఇమ్రాన్ పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరో సల్మాన్ కి పోటా పోటీగా కనిపించేందుకు ఇమ్రాన్ కండల వీరుడిగా మారడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీలో ప్రత్యర్థిగా ఇమ్రాన్ ఎంట్రీ స్టోరీకి భారీ వెయిటేజ్ పెంచనుందట అందుకే ఆ సన్నివేశాన్ని భారీగా చూపించేందుకు దాదాపు పది కోట్లు ఖర్చు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

వీరిద్దరి మధ్య యాక్షన్‌ సన్నివేశాలను అదిరిపోయేలా  ప్లాన్‌ చేసినట్లు చెబుతున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో కళ్ళు చెదరిపోయేలా ఈ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అంటూ సమాచారం. లోకేషన్ లకు కూడా భారీ గానే చెల్లించినట్లు తెలుస్తోంది.  మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ కు జోడీగా బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ నటిస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కనువిందు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: