నందమూరి నటసింహం బాలకృష్ణ తన మొదటి సినిమా తాతమ్మ కల చిత్రంతో తెరపై కనిపించాడు. ఆ సినిమా మంచి విజయం  సాధించింది. తన సినిమా లాగే తన కుమారుడు మోక్షజ్ఞను ఒక మంచి  సినిమాతో తెరపై నటింపచ్చేయాలని చూస్తున్నాడు. ఇదిలా ఉండగా  తనకు బాహా ఇష్టమైన  తనకు బాగా పేరు తెచ్చిపెట్టిన ఆదిత్య369 సీక్వెల్ గా ఆదిత్య 999 ను తీయాలనీ బాలయ్య తెలిపారు. ఈ సినిమాతో  మొక్షజ్ఞను సినిమాల్లోనటింప చేయాలనీ చూస్తున్నట్లు బాలయ్య కొన్నిరోజుల క్రితం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ మోక్షజ్ఞ సినీ ప్రవేశ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞ ఫిజిక్ పై దృష్టి పెట్టి తన లుక్ ను మార్చుకొనుటకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నారని కుంగ్ ఫు,మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది .

సీనియర్ స్టార్ దర్శకుడితో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందని ఇద్దరు నిర్మాతలు ఈ సినిమాను నిర్మించనున్నారని సినీ పరిశ్రమ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో లో మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం అందింది.ఈ సినిమాల తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ మూవీ తెరకెక్కించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. త్వరలో మోక్షజ్ఞ మొదటి సినిమా అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం అందింది.ఈ మధ్య కాలంలో మోక్షజ్ఞ బయట ఎక్కువగా కనిపించట్లేదు. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ బరువు తగ్గడని చెబుతున్నారు. బాలయ్య 2023లో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ అని చెప్పినా అంతకు ముందే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం బాలకృష్ణ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: