స్క్రీన్ ఏదైనా సరే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రంగంలో దిగితే దద్దరిల్లిపోవాల్సిందే. సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతున్న ఎన్.టి.ఆర్ స్మాల్ స్క్రీన్ పై కూదా తన టాలెంట్ చూపిస్తూ అలరిస్తున్నాడు. ఆల్రెడీ బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కి హోస్ట్ గా చేసిన ఎన్.టి.ఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షోని హోస్ట్ చేస్తున్నాడు. జెమిని టీవీలో ప్రసావమవనున్న ఈ షో లో ఈ సీజన్ కు మొదటి చీఫ్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అటెండ్ అయ్యారని తెల్స్తుంది.

ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు కలిసి ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తున్నారు. షో లో పాల్గొనడమే కాకుండా ఆ సినిమా ప్రమోషన్ కూడా చేసినట్టు ఉంటుందని కూడా తారక్ షోకి చరణ్ వచ్చాడని అంటున్నారు. సినిమా ద్వారా ఈ ఇద్దరు మరింత క్లోజ్ గా మారారని చెప్పుకుంటున్నారు. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు గేం షొలో భగంగా చరణ్ దాదాపుగా 25 లక్షల దాకా గెలిచుకున్నాడని సమాచారం. తారక్ షోలో చరణ్ పాతిక లక్షల ప్రైజ్ మనీతో సందడి చేశాడని తెలుస్తుంది.

ఆగష్టు 16న టెలికాస్ట్ అవనున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఎన్.టి.ఆర్, చరణ్ ల సరదా సంభాషణలు షోకి గుడ్ స్టార్ట్ అందిస్తాయని అంటున్నారు. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయడమే కాకుండా మొదటి గెస్ట్ గా చరణ్ రావడం కూడా షోకి మరింత క్రేజ్ ఏర్పడింది. తప్పకుండా ఈ ఇద్దరు చేసే హంగామా షోకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ షో కోసం ఎన్.టి.ఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో జరుగుతుంది. చరణ్ తర్వాత ఈ షోకి మరో గెస్ట్ కూడా వస్తారని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: