తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పూర్తి సమయం ప్రజాసేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాకపోతే ఈ హీరో అభిమానులు మరియు సినీ జనం కోరికమేరకు తిరిగి సినిమాల్లో నటించబోతున్నాను అని ప్రకటించాడు. ఆ ప్రకటనతో తెలుగులో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంతా మాతో సినిమా చేయండి అంటే...మాతో సినిమా చేయండి అంటూ పవన్ కళ్యాణ్ ముందు క్యూ కట్టారు. కానీ ఆ అదృష్టం మాత్రం దిల్ రాజుకు దక్కింది. శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' సినిమాను తెరకెక్కించారు. 

ఈ సినిమాను ఈ సంవత్సరం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టింది. 'వకీల్ సాబ్'  సినిమా నిర్మాణంలో ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ మరో కొన్ని సినిమాలకు పచ్చజెండా ఊపారు. అందులో ఒకటి  మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్. ఇది మల్టీ స్టారర్ కథ కావడంతో పవన్ కళ్యాణ్ తో దగ్గుబాటి రానా మరొక హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్సినిమా కథకు సంబంధించిన కొన్ని మార్పులు చేయడంతోపాటు మాటలను రాస్తున్నారు.

ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ను తెలియజేశారు. త్వరలోనే ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేయబోతున్నాం అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ఆసలైన మాస్ ఇదే ఇది...మన లీడర్...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అంటూ ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. దీనిపై రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా కామెంట్ చేశారు. దిష్టి తగులుతుంది...ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను...మీరే అర్థం చేసుకోండి అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ  ప్రకటన రావడంతో పవన్ అభిమానులు ఉత్సాహం రెట్టింపు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: