గత ఏడాది జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ముంబై ఇంటిలో శవమై కనిపించాడన్న విషయం తెలిసిందే. ఆయన మరణంతో బాలీవుడ్ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పటికే సుశాంత్ మరణంపై విచారణ జరుగుతోంది. సుశాంత్ కేసులో 3 ఏజెన్సీలు సిబిఐ, ఎన్సీబీ, ఈడీ విచారణ కొనసాగుతోంది. సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ గురించి, నటుడితో సంబంధం ఉన్న వ్యక్తుల గురించి అనేక విషయాలు బహిర్గతం అయ్యాయి. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లినా నేటికీ అతను అభిమానుల గుండెల్లో సజీవంగా ఉన్నాడు. సుశాంత్ అభిమానులు సోషల్ మీడియాలో అతని పేరుతో అనేక ఖాతాలను సృష్టించారు. అందులో తరచూ సుశాంత్ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా సుశాంత్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తన సినిమా 'కేదార్‌నాథ్' ప్రమోషన్ సమయంలో రెడ్ ఎఫ్‌ఎమ్‌లో ఇంటర్వ్యూ ఇస్తున్న వీడియో అది. ఆ సమయంలో సుశాంత్‌ సంతోషంగా ఉన్నాడు. ఈ ఇంటర్వ్యూలో సుశాంత్ తన గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

ఇందులో ఫస్ట్ క్రష్ ఎవరు ? అనే ప్రశ్నకు "నా క్లాస్ టీచర్" అంటూ సమాధానం ఇచ్చాడు సుశాంత్. దీని తరువాత తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చాడు. 9వ తరగతిలో తనకు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ఒప్పుకున్నాడు. మీకు ఇష్టమైన శరీర భాగం? అని ప్రశ్నించగా చాలాసేపు నవ్వేసిన సుశాంత్ ఆపై తన కళ్ళు అని ఆన్సర్ చెప్పారు. అబద్ధాలు చెప్పడం తనకున్న వింత అలవాటు అని, ఒక ద్వీపానికి వెళ్లాల్సి వస్తే తనతో తిరిగి రావడానికి ఒక మ్యాప్, పుస్తకాలు తీసుకెళ్తానని చెప్పాడు. తనకు చాలా డబ్బు వచ్చినప్పుడే సుశాంత్ చివరిగా ఏడ్చిన క్షణమని ఆ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో సుశాంత్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇందులో సుశాంత్ మనస్ఫూర్తిగా నవ్వుతూ కన్పిస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: