దర్శక ధీరుడు
రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్,
రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న
ఆర్ఆర్ఆర్ అనే
సినిమా చేస్తున్నాడు.
అక్టోబర్ లో ఈ చిత్రం విడుదల వాయిదా పడటంతో ప్రేక్షకులు ఒక్కసారిగా నిరాశ చెందారు. మొదటి నుంచి ఈ
సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ చిత్రం విడుదల తేది కన్ఫర్మ్ గా చెప్పట్లేదు కానీ ఈ
సినిమా విడుదల వచ్చే ఏడాది అని మాత్రం చెబుతున్నారు. అక్టోబర్ నెల చివరి వారం నాటికి ఈ
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయి అని తెలుస్తుంది.
అప్పుడు విడుదల తేదీ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం
సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కాకపోవడంతో తాత్కాలికంగా ఈ
సినిమా ప్రమోషన్ కు బ్రేక్ వేసిన
రాజమౌళి వచ్చే ఏడాది ఈ
సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల కంటే వచ్చే ఏడాదే విడుదల బాగుంటుందని చిత్రబృందం కూడా అనుకుంటుందట. బాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ లతో క్లాష్ ఏమాత్రం అవకుండా ఈ
సినిమా విడుదల తేదీని ప్రకటించా లనీ
జక్కన్న భావిస్తూన్నాడు. అందుకే ఈ
సినిమా ను విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు.
అంతేకాకుండా ఈ
సినిమా బడ్జెట్ 550 కోట్ల రూపాయలు కాగా ఈ
సినిమా హిట్ అనిపించుకోవాలంటే కనీసం వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ అందుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా కష్టం. ఒకవేళ సాధించకపోతే తనకు అవమానం అని భావించిన
రాజమౌళి ఈ సినిమాను పోస్ట్ చేయకు తప్పలేదని తెలుస్తుంది. అసలే
కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఇండస్ట్రీలో ఈ సినిమాను విడుదల చేసి మరింత భారం చేయకూడదు అని ఆయన ఇలా చేస్తున్నారట. గతంలో
బాహుబలి తో తాను క్రియేట్ చేసిన రికార్డులను తానే అధిగమించాల్సి ఉన్న పరిస్థితి లో ఈ
సినిమా ఎలాంటి పోటీ లేకుండా విడుదల చేసి భారీ కలెక్షన్లు సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.