తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతోమంది కమెడియన్లు వస్తూ ఉన్నారు. ఇక అప్పట్లో రేలంగి, అల్లు రామలింగయ్య, రాజా బాబు ఇలా ఎంతోమంది కమెడియన్స్ గా ఉండేవారు. వీరితో పాటే నవ్వుల రారాజులు గా పేరుపొందిన ఇద్దరు నటులు కూడా ఉన్నారు. వారు ఎవరో కాదు కోట శ్రీనివాసరావు-బాబూ మోహన్. వీరిద్దరూ కలిసి సినిమాలో ఉన్నారంటే ఇక ఆ సినిమా ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చుతుంది.

ఇక వీరిద్దరూ వేసుకొనే పంచు డైలాగులు, మాట్లాడుకునే మాటలు ప్రేక్షకులను ఎంతగానో కితకితలు పెడతాయి. ఇక అంతే కాకుండా కొన్ని సినిమాలలో అయితే వీరిద్దరూ లేకపోతే ఆ సినిమానే ప్రేక్షకులు చూసే వారు కాదట. అంతలా ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ఇక వీరిద్దరూ కలిసి ఆలీతో సరదాగా షో లో కొన్ని విషయాలు తెలియజేశారు.

కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బాబు మోహన్, నేను కలసి నటించిన మొదటి చిత్రం బొబ్బిలి రాజా. కానీ కోట శ్రీనివాసరావు మాత్రం అంతకుముందే ప్రతిఘటన లాంటి సినిమాలతో సినీ ఇండస్ట్రీలో బిజీగా వున్నారు. బాబు మోహన్ కూడా జంధ్యాల సినిమాలు చేస్తున్నట్లుగా తెలిసింది. కానీ మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం మాత్రం బొబ్బిలిరాజా అని చెప్పుకొచ్చాడు. ఇక మా ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది మాత్రం"మామగారు" .ఈ సినిమా ద్వారానే మా నటనకు గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు.ఇక అంతే కాకుండా ఆ సినిమాలో బాబు మోహన్ ను తన్నేటటువంటి సీన్లు చూస్తే..వీరు ఎలా భరించారో అని అనుకున్నాను.

కానీ బాబూ మోహన్ మాత్రం టచ్ అవ్వగానే వెళ్లి పల్టీ కొట్టేవాడు. అది వాడి గొప్పతనం అంటూ చెప్పుకొచ్చాడు కోట శ్రీనివాసరావు. బాబూ మోహన్ ఒక మంచి గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పుకొచ్చాడు కోట. మా ఇద్దరి కాంబినేషన్లో 70  సినిమాలు వరకు చేశాము. ఇలా జర్నీ చేస్తున్న సమయంలోనే  ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చాడు కోట. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్ లాంటి మరో కాంబినేషన్ బహుశా రాదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: