దర్శకుడు కృష్ణవంశీకి మెగాస్టార్ చిరంజీవికి మధ్య మంచి అనుబంధం ఉందని అందరకు తెలుసు.

మెగాస్టార్ తో కృష్ణవంశీ సినిమా చేయకపోయినా.. కృష్ణవంశీ చేసే ప్రతి సినిమా కథ చిరుకు చెబుతూ ఉంటారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే కృష్ణవంశీ రూపొందిస్తున్న కొత్త సినిమా 'రంగమార్తాండ' కథను కూడా చిరంజీవికి చెప్పారని సమాచారం.అయితే, ఈ కథలో పాత్రల పరిచయం చాలా కీలకమని ఈ పరిచయాలను కృష్ణవంశీ తన వాయిస్ తోనే లేక రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేతనో చెప్పించాలి అనుకున్నారని తెలుస్తుంది.

అయితే, 'రంగమార్తాండ' కథ విన్న చిరంజీవి కృష్ణవంశీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. 'నీ కోసం ఆ పాత్రల పరిచయ వాయిస్ నేను ఇస్తాను' అని మాట ఇచ్చారని సమాచారం. ఇదంతా కరోనా కాలానికి ముందు జరిగిందని ఈ మధ్యలో ఎన్నో జరిగాయని పైగా మధ్యలో కృష్ణవంశీ మెగాస్టార్ తో టచ్ లో లేరని మరోపక్క తన సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ చేశారని డబ్బింగ్ కూడా మొదలు పెట్టారని తెలుస్తుంది.

చిరంజీవి ఇచ్చిన మాట కృష్ణవంశీకి గుర్తు ఉందని కానీ వెళ్లి అడగాలి అంటే మొహమాటమని తెలుస్తుంది.స్వతహాగా ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న మనిషి కృష్ణవంశీ అందుకే చిరంజీవికి 'రంగమార్తాండ' డబ్బింగ్ గురించి చెప్పలేదని అయితే, ఓ మేనేజర్ ద్వారా శబ్దాలయ స్టూడియోలో 'రంగమార్తాండ' డబ్బింగ్ జరుగుతుంది అని చిరంజీవికి తెలిసిందట.. వెంటనే స్టూడియోకి వచ్చారని తెలుస్తుంది..

కృష్ణవంశీని పిలిచి మందలించారని తెలుస్తుంది.. 'మాట ఇచ్చాను కదా, పిలవాలి కదా' అంటూ సీరియస్ అయ్యారట.. ఇక తానే కలగజేసుకుని ఈ సినిమాలో పాత్రల పరిచయానికి వాయిస్ ఓవర్ ఇచ్చారని తెలుస్తుంది.మెగాస్టార్ చిరంజీవి ఈ సాయంత్రం ఈ సినిమా వాయిస్ ఓవర్ మొత్తం పూర్తి చేశారని తెలుస్తుంది.ఏది ఏమైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చిరు చేసిన పనికి కృష్ణవంశీ షాక్ అయి అలాగే నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడని తెలుస్తుంది.

గతంలో మెగాస్టార్ చిరంజీవి - కృష్ణవంశీ కాంబినేషన్ లో'వందేమాతరం' అనే సినిమాని అనుకున్నా కానీ ఎందుకో ఆ సినిమా కార్యరూపం దాల్చలేకపోయిందని తెలుస్తుంది. అయినా వీరిద్దరి మధ్య అనుబంధం మాత్రం అలాగే ఉందని క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీ అంటే చిరుకు నమ్మకమని  తెలుస్తుంది.ఇక 'రంగమార్తాండ' సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ మరియు శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: