టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు తొలిసారిగా ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమాని గౌతమ్ మీనన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అప్పట్లో సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా తరువాత ఒక్కొక్కటిగా పెద్ద ఆఫర్స్ అందుకున్న సమంత, వాటితో కూడా పలు విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఆపైన ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా వరుసగా పలువురు బడా స్టార్స్ సరసన నటించి సూపర్ హిట్స్ కొట్టిన సమంత ఇటీవల అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్నారు.

అయితే నాలుగేళ్ళ కాపురం తరువాత కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కొన్నాళ్ల క్రితం భర్త చైతన్య నుండి విడిపోయి ప్రస్తుతం తన ఫ్యామిలీతో జీవిస్తున్నారు సమంత. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇటువంటి కష్ట సమయాలు కొన్ని వస్తుంటాయని, కానీ వాటికి తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగగలిగితే తప్పకుండా రాబోయే రోజుల్లో జీవితం మళ్ళి దారిలో పడుతుందని ఆమె ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది.

ఇక విషయం ఏమిటంటే చైతన్య తో బ్రేకప్ అనంతరం తన ఫ్యామిలీ తో కలిసి నివసించేందుకు హైదరాబాద్ లో ఒక పెద్ద ఇల్లును సమంత కొనుగోలు చేసారని, దాదాపుగా యాభై కోట్లకు పైగా ఖరీదు చేసే ఈ ఇంటిని సమంత సన్నిహితులు ఎంతో జాగ్రత్తగా పరిశీలించి ఆమెతో కొనుగోలు చేయించారని సమాచారం. బ్రేకప్ తరువాత సమంత పూర్తిగా చెన్నై లేదా కేరళ వెళ్ళిపోతారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తనకు జీవితాన్నిచ్చిన తెలుగు సినిమాని, ప్రేక్షకులని ఎప్పటికీ మర్చిపోలేనని, అందుకే తన సొంత ఊరుగా భావించే హైదరాబాద్ లోనే ఆమె ఈ నూతన గృహాన్ని కొనుగోలు చేసినట్లు టాక్. ఇక ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద సినిమాలతో పాటు ఒక హాలీవుడ్ సినిమా కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: