తాజాగా ఆచార్య సినిమా విడుదలైన వెంటనే తన 15వ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్నది. ఇక ఇలాంటి సమయంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది ఉపాసన. ఈ ఎండల నుంచి తనకు ఉపశమనం పొందడం కోసం తనకు ఎక్కడైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలని ఉన్నదని తెలియజేసింది ఉపాసన. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్ట్ తెలియజేసింది. ఈ విషయంపై రామ్ చరణ్ కూడా స్పందిస్తు.. తనకు కూడా వెకేషన్ కు వెళ్లాలని ఉందని తెలియజేశాడు.
కానీ అలా వెళ్లాలంటే కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు అంటూ ఉపాసనను ట్యాగ్ చేశారు. ఏ విధంగా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ పరస్పరం స్పందించడం పై.. తమ అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇక గత కొద్ది రోజుల క్రితమే ఉపాసన రామ్ చరణ్ కలిసి హాలిడే ట్రిప్ బాగా ఎంజాయ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆఫ్రికాట్ ఊరికి వెళ్లడంతో ఈ జంట అక్కడ కొన్ని క్రూరమైన మృగాలు మధ్య సఫారీ కూడా చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి