బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లోంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం తెలిసిందే. ఆరు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌజ్ లో ఐదుగురు కంటెస్టంట్స్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పనిసరి అయ్యింది. ఆగష్టు 25 ఆదివారమే బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు. కాని ఆడియెన్స్ ఊహించినట్టుగా ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగలేదు.


అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వారం వాయిదా పడినా అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చేది ఎవరన్న దాని మీద డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ, క్రేజీ హీరోయిన్ ఐటం గాళ్ శ్రద్ధా దాస్ లలో ఒకరు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా సర్ ప్రైజింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.


వీళ్లకు కొన్ని పవర్స్ ఇచ్చి హౌజ్ లోకి పంపిస్తారట. అంతేకాదు ఇప్పటివరకు బయట నుండి షో చూశారు కాబట్టి హౌజ్ లో పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకున్న కంటెస్టంట్స్ మీద వైల్డ్ కార్డ్ టార్గెట్ చేస్తారని తెలుస్తుంది. ఈషా రెబ్బ అయితే తెలుగు అమ్మాయి కాబట్టి ఆమెకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. శ్రద్ధ దాస్ కూడా తెలుగు మాట్లాడగలదు కాని ఆమె ఎంతైనా ఇక్కడ భామ కాదు.


అందుకే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ గా ఈషానే పర్ఫెక్ట్ అంటున్నారు. అంతేకాదు హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులలో కూడా ఇద్దరు కంటెస్టంట్స్ మళ్లీ హౌజ్ లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. లాస్ట్ సీజన్ లో లానే ఓటింగ్ ద్వారా ఇద్దరు కంటెస్టంట్స్ ను తిరిగి హౌజ్ లోకి పంపిస్తారట. రోహిణి, అషుల ఎలిమినేషన్ టైంలో హోస్ట్ నాగార్జున కూడా మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లే ఛాన్స్ వస్తే వెళ్తారా అంటూ రీ ఎంట్రీ గురించి క్లూ ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: