అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ అందుకోలేకపోయాడు. అనుభవం ఉన్న డైరెక్టర్ తో చేసినా... కొత్త డైరెక్టర్ తో చేసినా అఖిల్ రాత మాత్రం ఏ మాత్రం మారలేదు. మరొకవైపు చైతు మార్కెట్ కూడా క్రమంగా పడిపోతూ వస్తోంది. 'మజిలీ' భారీ హిట్ సాధించినా... అందులో క్రెడిట్ అంతా సమంతా ఖాతా లోకే వెళ్ళిపోయింది అనే చెప్పాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు వారిద్దరికీ కలిపి ఒకే అవకాశం వచ్చింది. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం లో వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారట.

'ఆర్ఎక్స్ 100' సినిమా తో బాగా పాపులర్ అయిన అజయ్ భూపతి తర్వాత 'మహాసముద్రం' అనే స్క్రిప్టు రాసుకున్నాడు. ఆ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు  అతను గత కొన్నాళ్లుగా చాలా శ్రమ పడుతున్నాడు. ముందు బెల్లంకొండ శ్రీనివాస్ మరియు రవితేజ ఈ ప్రాజెక్టు చేసేందుకు ఒప్పుకున్నా... తర్వాత ఏవో కారణాలతో వారే చిత్రం నుంచి వైదొలిగారు. చివరికి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు భవ్య బ్యానర్ ముందుకు వచ్చింది. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏమిటంటే ఈ చిత్రం మల్టీస్టారర్ కానుందని.... అందులో అక్కినేని నాగ చైతన్య చేసింది మరియు అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలు పోషించి పడుతున్నారట.

ప్రస్తుతం 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగో చిత్రం చేస్తున్న అఖిల్ త్వరలోనే 'మహాసముద్రం' షూటింగ్ లో పాల్గొబోతున్నాడట. 'ఆర్ఎక్స్ 100' లాంటి మాస్ మరియు రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తీసిన అజయ్ భూపతి ఇప్పుడు కూడా అదే పంథాలో అఖిల్l మరియు నాగచైతన్య కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా కాస్టింగ్ పై కసరత్తు చేస్తున్న భూపతి త్వరలోనే అఫీషియల్ గా మిగిలిన సమాచారాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అప్పటివరకు ఇవి అన్ని రూమర్లు గానే తిరుగుతుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: