అదే జోరులో ఉన్న మమత... బిజెపి అధికారంలో ఉన్న గోవా రాష్ట్రం పై కన్నేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మమత ఇప్పటి నుంచి స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ఇద్దరు ముఖ్య నేతలను గోవా పంపిన మమతా... రాష్ట్రంలో ప్రముఖులతోపాటు కీలక నేతలను కూడా టీఎంసీలో చేరేలా వ్యూహాలు రచిస్తున్నారు. గోవాలో మనోహర్ పారికర్ లేని లోటు బిజెపిలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంప్యైనర్ ల కోసం కమలం పార్టీ నేతలు ఇప్పటి నుంచే వేట మొదలుపెట్టారు. దీంతో ఇదే సరైన సమయం అని భావించిన దీదీ... గోవా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త నినాదం తీసుకొని వచ్చింది. బెంగాల్ లో తన విజయానికి బాటలు వేసిన ఖేలా హోబే నినాదాన్ని మరోసారి గోవాలో ప్రయోగిస్తోంది. అలాగే బెంగాల్, గోవా మధ్య సారూప్యత ఉండే ఫుట్ బాల్, చాపలు అంశాలను తెరపైకి తీసుకుని వచ్చింది. టి.ఎం.సి కీలక నేత డెరెక్ ఓబ్రయిన్ తో పాటు మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ ప్రసూన్ బెనర్జీలకు గోవా బాధ్యత అప్పగించారు మమత. వీరిద్దరూ వారం రోజుల పాటు గోవాలో విస్తృతంగా పర్యటించి అక్కడ పరిస్థితులపై ఓ నివేదికను పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అందివ్వనున్నారు. గోవాలో టీఎంసీ గెలవాలంటే ఏం చేయాలనే సలహాలను కూడా ఇద్దరు నేతలు సూచించనున్నారు. ఏది ఏమైనా... ఇప్పటికే తూర్పు తీరంపై సత్తా చాటిన మమత ఇప్పుడు పశ్చిమ తీరం పై కూడా కన్నేశారు.
అదే జోరులో ఉన్న మమత... బిజెపి అధికారంలో ఉన్న గోవా రాష్ట్రం పై కన్నేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మమత ఇప్పటి నుంచి స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ఇద్దరు ముఖ్య నేతలను గోవా పంపిన మమతా... రాష్ట్రంలో ప్రముఖులతోపాటు కీలక నేతలను కూడా టీఎంసీలో చేరేలా వ్యూహాలు రచిస్తున్నారు. గోవాలో మనోహర్ పారికర్ లేని లోటు బిజెపిలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంప్యైనర్ ల కోసం కమలం పార్టీ నేతలు ఇప్పటి నుంచే వేట మొదలుపెట్టారు. దీంతో ఇదే సరైన సమయం అని భావించిన దీదీ... గోవా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త నినాదం తీసుకొని వచ్చింది. బెంగాల్ లో తన విజయానికి బాటలు వేసిన ఖేలా హోబే నినాదాన్ని మరోసారి గోవాలో ప్రయోగిస్తోంది. అలాగే బెంగాల్, గోవా మధ్య సారూప్యత ఉండే ఫుట్ బాల్, చాపలు అంశాలను తెరపైకి తీసుకుని వచ్చింది. టి.ఎం.సి కీలక నేత డెరెక్ ఓబ్రయిన్ తో పాటు మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ ప్రసూన్ బెనర్జీలకు గోవా బాధ్యత అప్పగించారు మమత. వీరిద్దరూ వారం రోజుల పాటు గోవాలో విస్తృతంగా పర్యటించి అక్కడ పరిస్థితులపై ఓ నివేదికను పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అందివ్వనున్నారు. గోవాలో టీఎంసీ గెలవాలంటే ఏం చేయాలనే సలహాలను కూడా ఇద్దరు నేతలు సూచించనున్నారు. ఏది ఏమైనా... ఇప్పటికే తూర్పు తీరంపై సత్తా చాటిన మమత ఇప్పుడు పశ్చిమ తీరం పై కూడా కన్నేశారు.