టీడీపీ లో ఫైర్ బ్రాండ్ ల నేతలకు కొదువ లేదు.. చంద్రబాబు హయాంలో చంద్రబాబు పై ఈగ కూడ వాలనిచ్చేవారు కాదు ఈ ఫైర్ బ్రాండ్ లు.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌, పంచుమ‌ర్తి అనురాధ‌, స‌బ్బం హ‌రి, గంటా శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.., బోడే ప్ర‌సాద్‌, కేశినేని నాని, బీటెక్ ర‌వి, బుద్దా వెంక‌న్న ఇలా చాలామంది టీడీపీ కి గట్టి లీడర్లు గా ఉండేవారు.. టీడీపీ తరపున అప్పటి ప్రతిపక్షాలను కోలుకోనివ్వకుండా చేశారు.. టీడీపీ తో పెట్టుకోవాలంటే వీళ్ళను చూసి సగం భయపడేవాళ్లు ప్రతిపక్ష నేతలు.. అలాంటిది ఈ నేతల నోళ్లు గత కొన్ని నెలలుగా మూగబోయాయి..

ఇదిలా ఉంటె కేశినేని నాని చంద్రబాబు తిరుగుబావుటా ఎగరవేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పాలిటిక్స్‌లోనే స్పెష‌ల్ పాలిటిక్స్ చేయ‌డంలో త‌న‌దైన శైలిలో వ్యవ‌హ‌రిస్తున్న విజ‌య‌వాడ ఎంపీ, టీడీపీ నాయ‌కుడు కేశినేని నాని గతంలో ఎన్నో వివాదాలు ఉన్నారు.. సొంత పార్టీ నేతలతో నే ఆయనకు ఎన్నో భేదాపిప్రాయాలు ఉన్నాయి. 2014లో ర‌వాణా వ్యాపారం నుంచి రాజ‌కీయాల్లోకి వచ్చిన నాని విజ‌యవాడ ఎంపీగా టికెట్ పొంది.. గెలుపు గుర్రం ఎక్కారు.  రెండోసారి కేశినేని నాని గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీని త‌ట్టుకుని గెలిచారు.

ఈ క్రమంలో పార్లమెంట‌రీ ప‌క్ష నాయ‌కుడిగా త‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అనుకున్న కేశినేని నానికి నిరాశే ఎదురైంది. గుంటూరు ఎంపీ గ‌ల్లా ఈ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. దీంతో ఇద్దరు ఎంపీల‌కు ద‌క్కుతున్న గౌర‌వం, ప‌ద‌వులు కూడా త‌న‌కు ల‌భించ‌డం లేద‌నే ఆవేద‌న‌లో ఉన్నారు.అంతేకాదు పార్టీలో మ‌రో ఇద్దరు ఎంపీలు రామ్మోహ‌న్ నాయుడుకు, గ‌ల్లా జ‌య‌దేవ్‌కు ఉన్న ప్రాధాన్యత నానికి లేకుండా పోయింద‌న్నది వాస్తవం. దీంతో నాని దీనిపై తీవ్రంగా అలోచించి త్వరలోనే టీడీపీ కి ఓ షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట..గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర స‌హా.. బొండా ఉమామ‌హేశ్వర‌రావుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, వ‌ర్ల రామ‌య్యకు కూడా అవ‌కాశం క‌ల్పించారు. వీరంతా ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారే గెలిచినా తనకెందుకు ప్రాధాన్యం ఇవ్వట్లేదన్నది కేశినేని వాదన..

మరింత సమాచారం తెలుసుకోండి: