ఈ మధ్యకాలంలో ఆకతాయిల బెడద ఎక్కడ చూసినా ఎక్కువ అవుతుంది అన్న విషయం తెలిసిందే.  ఆకతాయిల నుండి మహిళలు ఏదో ఒక విధంగా వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మహిళను వేధిస్తున్న వారిని వేధిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తూ  ఉన్నప్పటికీ కూడా... ఆకతాయిలు పోకిరీల  తీరులో  మాత్రం మార్పు రావడం లేదు  ఏదో ఒక విదంగా మహిళలను ఇబ్బందులకు గురి చేసి రాక్షసనందాన్ని పొందుతూ ఉంటారు ఆకతాయిలు అన్న విషయం తెలిసిందే.  ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. పోకిరి ఏకంగా మహిళలు స్నానాలు చేసే గదిలనే టార్గెట్గా చేసుకుని దారుణాలకు పాల్పడుతూ వచ్చాడు. స్నానాలు చేస్తున్న సమయంలో నగ్న దృశ్యాలను చిత్రీకరించి వాటితో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం తోపాటు పాటు శారీరక అవసరాలు కూడా తీర్చుకోవాలని అనుకున్నాడు ఇక్కడ ఒక నీచుడు.


 ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ఇలాగే కొనసాగిస్తుండగా ఇటీవలే ఒక బాత్రూం వద్ద మహిళ స్నానం చేస్తుండగా సెల్ఫోన్ తో  వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో చూసిన మహిళా ఒక్కసారిగా అప్రమత్తమై కుటుంబ సభ్యులకు చెప్పడంతో నీచుడి  గుట్టు  బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన రూపేష్ అనే వ్యక్తి ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. రాజీవ్ నగర్ లో ఒక ఫ్లాట్ లో  అద్దెకు ఉంటున్నాడు. పక్కింట్లో వున్న మహిళ పై కన్నేసిన సదరు వ్యక్తి.. ఏదో ఒక విధంగా సదరు మహిళను బ్లాక్మెయిల్ చేసి కోరికలు తీర్చు కోవాలని అనుకొన్నాడు. ఈ క్రమంలోనే ఇంటికి ఆనుకుని బాత్రూం లోనే సదరు మహిళ స్నానం చేస్తూ ఉంటుంది  అని గుర్తించిన యువకుడు.. ఓ రోజు ఏకంగా మహిళ స్నానం చేస్తూ ఉన్న సమయంలో మొబైల్ ద్వారా వీడియోలు తీసేవాడు.



 కొన్ని రోజులుగా ఇదే కొనసాగిస్తూ వస్తున్నాడు.  ఇటీవలే మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసేందుకు ప్రయత్నించగా  మహిళ గమనించి ఒక్కసారిగా అప్రమత్తమైంది. దీంతో కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగా కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో స్థానికులు అందరూ కలిసి పట్టుకుని చితక బాదారు. పోలీసులకు అప్పగించడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కు పంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: