హైదరబాద్,ఉప్పల్ : టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది నచ్చితేనే ఓటేయండి అని ఘట్కేసర్ మండల ఎం‌పి‌పి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు.ఉప్పల్ నియోజికవర్గం లో గ్రేటర్ ఎన్నికల నిమిత్తం ప్రచారం నిర్వహించిన అయన నియోజిక వర్గంలోని హాబ్సిగూడ 8 వ డివిజన్ కార్పొరేటర్ టి‌ఆర్‌ఎస్ అబ్యర్థి బేతి స్వప్న సుభాష్ రెడ్డికి మద్దతు గా ఓటేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత సి‌ఎం కే‌సి‌ఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని ఆయన తెలిపారు రాష్ట్ర పురపాలక శాఖ,ఐ‌టి శాఖ మంత్రి కే‌టి‌ఆర్ గారు హైదరబాద్ ను అన్నీ రంగాలలో అభివృద్ది చేశారన్నారు.జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో నాణ్యమైన 24 విద్యుత్త్ ను ఇస్తున్నారని తెలిపారు.

 పేద వాడికోసం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి దశకు చేరిందని తెలిపారు.ఇలా అన్నీ వర్గాల ప్రజల కోసం మన ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని,అభివృద్ది చూసే తమకు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.టి‌ఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బేతి స్వప్న సుభాష్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.  .

మరింత సమాచారం తెలుసుకోండి: