ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని దారుణ శిక్షలు విధించిన మహిళల పై జరుగుతున్న అత్యాచార ఘటనలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు  రోజు రోజుకు ఎంతో మంది మహిళలు కామాంధుల బారినపడి బలవుతున్నారు. అయితే  ఆడపిల్ల కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చి పోతున్నారు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడంలేదు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్ళు. రోజు రోజుకు వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఆడ పిల్లలకు కనీస రక్షణ కరువైంది అన్నది అర్ధమవుతుంది.



 ఇక ఆడపిల్ల కనిపిస్తే అత్యాచారం చేయడమే కాదు ఇక దారుణంగా హత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని మొత్తం ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది   డ్రైనేజీ లో ఓ మహిళ మృత దేహం లభ్యం కావడం ఇక మృతదేహం మొత్తం పూర్తిగా ఎలాంటి దుస్తులు లేకుండా నగ్నం గా ఉండటం సంచలనం గా మారి పోయింది. అంతేకాకుండా సదరు మహిళ మర్మాంగాలపై తీవ్రమైన గాయాలు అయి ఉండడం కూడా అందరిని ఒక్కసారిగా భయ భ్రాంతులకు గురి చేసింది.



 ఎప్పుడూ ప్రజల రద్దీ ఉండే ఎంటిఎన్ఎల్ జంక్షన్ దగ్గర ఈ మృతదేహం లభ్యం కావడంతో స్థానికం గా ఈ ఘటన ఒక్కసారిగా చర్చనీయాంశం గా మారి పోయింది. బాంద్రా ప్రాంతం లో డ్రైనేజీలో ఇలా మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక సదరు మహిళ గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. అంతేకాకుండా జననాంగాల పై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: